AP Heavy Rains: ఆంధ్ర ప్రదేశ్ కు మరో తుపాను ముప్పు.. తెలంగాణలోను భారీ వర్షాలు..

Sat, 19 Oct 2024-12:21 pm,

వాయుగుండం ప్రభావంతో వచ్చే నాలుగు రోజులు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వర్షాలు కురుస్తాయని చెప్పింది. అక్టోబరు 22 నాటికి మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉందని.. అది వాయువ్య దిశగా కదిలి అక్టోబర్ 24 నాటికి వాయుగుండంగా మారొచ్చునని తెలిపింది.

తెలంగాణలో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని తెలిపింది.

 

మరోవైపు నేడు నిర్మల్‌, జగిత్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, ఆదిలాబాద్‌, కుమరంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం, వరంగల్‌, హనుమకొండ, జనగామ, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్‌, యాదాద్రి-భువనగిరి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయన్నారు.

అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటుగా గంటకు 40 కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశాలున్నాయని తెలిపింది.   ఈ మేరకు ఆయా జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది.

హైదరాబాద్ నగరంలో నేడు పొడి వాతావరణం ఉంటుందని చెప్పింది.  ఉదయం కాస్త ఎండగా ఉంటుందని.. మేఘాలు వస్తూ పోతూ ఉంటాయని తెలిపింది.  

 

సాయంత్రానికి వాతావరణం పూర్తిగా చల్లబడి వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. కాగా నిన్న సాయంత్రం నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది.

 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link