Highest Paid Actress: 50 సెకండ్ల కోసం రూ.5కోట్లు.. ఈ సౌత్ హీరోయిన్ డిమాండ్ చూస్తే షాక్..!

Fri, 20 Sep 2024-10:11 pm,

ఒకవైపు సినిమాలు,  మరొకవైపు యాడ్స్ లో నటిస్తూ భారీగా సంపాదిస్తున్న ఈమె కొన్ని సెకండ్ల యాడ్ కోసం భారీ మొత్తంలో పారితోషకం తీసుకొని అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ఒక్కో చిత్రం కోసం దాదాపుగా రూ.10 కోట్ల పారితోషకం తీసుకుంటున్న నయనతార కేవలం 50 సెకండ్ల యాడ్ కోసం ఏకంగా రూ .5కోట్లు తీసుకొని అందరినీ ఆశ్చర్యపరిచింది.  

2003లో మలయాళ మూవీ మనసినక్కరే అనే చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈమె ఆ తర్వాత రజనీకాంత్ సరసన చంద్రముఖి సినిమాలో నటించి పాపులారిటీ అందుకుంది. ఇక తెలుగు, తమిళ్ , కన్నడ, మలయాళం అంటూ భాషతో సంబంధం లేకుండా ప్రతి భాషలోనూ నటిస్తున్న ఈమె ఇటీవల షారుక్ ఖాన్ హీరోగా నటించిన జవాన్ చిత్రంతో బాలీవుడ్లోకి కూడా అడుగు పెట్టింది. 

బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా ప్రకంపనలు సృష్టించిందని చెప్పవచ్చు. ఈ చిత్రంలో నటించినందుకు భారీ మొత్తంలో పారితోషికం అందుకున్నట్లు సమాచారం. ఈ సినిమా తెచ్చి పెట్టిన క్రేజ్ కారణంగా సౌత్ ఇండస్ట్రీలో కూడా అంతే రేంజ్ లో పారితోషకం తీసుకుంటూ దూసుకుపోతోంది. ఇక అలా 2 దశాబ్దాల సినీ కెరియర్లో 75 కి  పైగా చిత్రాలలో నటించిన ఈమె ఎన్నో అవార్డులను కూడా అందుకుంది. 

ఇంత పాపులర్ దక్కించుకున్న ఈమె తాజాగా డీటీహెచ్ సంస్థ టాటా స్కై యాడ్ లో నటించడానికి భారీ రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం. ఈ యాడ్ కోసం రెండు రోజులు షూట్ చేశారట. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషలో ఈ యాడ్ ప్రసారం అవుతోంది. కేవలం 50 సెకండ్ల కోసం దాదాపు రూ .5 కోట్లు వసూలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు 50 సెకండ్ల కోసం రూ .5 కోట్లు వసూల్ చేసి భారతదేశంలో అత్యధిక పారితోషకం తీసుకునే నటిగా రికార్డ్ క్రియేట్ చేసింది లేడీ సూపర్ స్టార్ నయనతార.

ప్రస్తుతం నయనతారకు సంబంధించిన ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. సాధారణంగా బాలీవుడ్ హీరోయిన్స్ హై రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటూ అందరిని ఆశ్చర్యపరుస్తారు. అయితే వారందరికీ షాక్ ఇస్తూ ఈమె 50 సెకండ్ల కోసం 5 కోట్ల రూపాయలు తీసుకుందంటే ఈమె రేంజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link