IPL 2024 Auction: ఐపీఎల్ వేలానికి రంగం సిద్ధం.. ఈ టాప్-5 టీమిండియా ప్లేయర్లపైనే అందరి దృష్టి

Tue, 19 Dec 2023-12:01 am,

ఐపీఎల్ 2022 సీజన్‌కు ముందు పేసర్ హర్షల్ పటేల్‌ను 10.75 కోట్ల రూపాయలకు ఆర్‌సీబీ కొనుగోలు చేసింది. హర్యానాకు చెందిన ఈ ఫాస్ట్ బౌలర్ మంచి ప్రదర్శన చేసి ఆ సీజన్‌లో 19 వికెట్లు పడగొట్టాడు. 2023 సీజన్‌లో 14 వికెట్లు తీసుకున్నాడు. అయితే ఎకానమీ రేటు 9.65తో పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో ఆర్‌సీబీ వదులుకుంది. హర్షల్ బేస్ ధర రూ.2 కోట్లతో వేలంలోకి రానున్నాడు.  

ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌ను కూడా 2024 సీజన్‌కు ముందు కేకేఆర్ విడుదల చేసింది. 2023 సీజన్‌లో 11 మ్యాచ్‌ల్లో ఒక అర్ధ సెంచరీ సహాయంతో 113 పరుగులు చేసి 7 వికెట్లు తీశాడు. శార్దూల్ బేస్ ధర కూడా రూ.2 కోట్లగా ఉంది.   

యువ పేసర్ చేతన్ సకారియా గత సీజన్‌లో కేవలం 2 మ్యాచ్‌లు మాత్రమే ఆడి 3 వికెట్లు పడగొట్టాడు. 2022లో కూడా అతను కేవలం 3 మ్యాచ్‌ల్లో 3 వికెట్లు తీశాడు. 2021లోనే టీమిండియా తరపున అరంగేట్రం చేశాడు.   

అండర్-19 ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శనతో శివమ్ మావిని కేకేఆర్ రూ.3 కోట్లకు కొనుగోలు చేసింది. 2018లో కేకేఆర్ తరపున అరంగేట్రం చేశాడు. శివమ్ తన బేస్ ధరను రూ.50 లక్షలతో వేలంలో పాల్గొననున్నాడు.  

రూ.50 లక్షల బేస్ ప్రైస్‌తో మనీష్ పాండే వేలంలోకి రానున్నాడు. ఆర్‌సీబీ, పూణె వారియర్స్, కేకేఆర్, సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటిల్స్ జట్లకు మనీశ్ పాండే ప్రాతినిధ్యం వహించాడు.    

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link