IRCTCలో సరికొత్తగా Bus Tickets బుకింగ్ సౌకర్యం, 22 రాష్ట్రాల్లో ప్రయాణికులకు సేవలు

Sun, 07 Feb 2021-11:13 am,

ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(IRCTC) మరో సరికొత్త సదుపాయాన్ని తీసుకొచ్చింది. ఇకనుంచి రైలు టికెట్లతో పాటు బస్ టికెట్లను సైతం ఆన్‌లైన్‌లో బుకింగ్‌ను ప్రవేశపెట్టింది. జనవరి 29 నుంచి బస్ టికెట్ల బుకింగ్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు తాజాగా ఐఆర్‌సీటీసీ ఓ ప్రకటనలో తెలిపింది.

Also Read: Ujjwala Yojana: Free LPG కనెక్షన్, రూ.1600 రావాలంటే PMUY వివరాలు తెలుసుకోండి

ఐఆర్‌సీటీసీలో ఇదివరకే ఆన్‌లైన్‌‌లో రైలు, విమాన టికెట్లు బుకింగ్ సదుపాయాన్ని కల్పిస్తోంది. ఇటీవల తాము బస్ టికెట్ల బుకింగ్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొంది. కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖతో కలిసి  ఐఆర్‌సీటీసీ ఈ తాజా సేవల్ని కూడా అందుబాటులోకి తెచ్చింది. (Photo: irctc)

బస్ టికెట్లను బుక్ చేసుకోవాలంటే ఈ వెబ్‌సైట్  https://www.bus.irctc.co.in/home లోకి వెళ్లాలి. ఆ హోం పేజీలో మీరు బస్సు టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఒకేసారి గరిష్టంగా 6 బస్ టికెట్లు బుక్ చేసుకునే సౌకర్యాన్ని IRCTC కల్పిస్తోంది.

Also Read: Also Read: International Flights: అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం పొడిగించిన DGCA

మార్చి మొదటి వారం నుంచి ఐఆర్‌సీటీసీ బస్ టికెట్ బుకింగ్ సర్వీసు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుంది. మొబైల్ యాప్‌లోనూ టికెట్లు బుక్ చేసుకునేలా మార్పులు చేస్తున్నారు.

Also Read: Income Tax: ఇన్‌కమ్ ట్యాక్స్ లేని దేశాలు కూడా ఉన్నాయి, No Income Tax దేశాలు ఇవే

పలు రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన మొత్తం 50 వేల బస్సులతో పాటు ప్రైవేట్ బస్సులు సేవల్ని అందించనున్నాయి. 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఐఆర్‌సీటీసీ బస్ టికెట్లను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చునని సూచించింది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link