Meloni and Modi Pics: ప్రదాని మోదీతో ఇటలీ ప్రధాని మెలోనీ సెల్ఫీ వైరల్

Sun, 16 Jun 2024-5:55 pm,

మెలోనీతో మోదీ మెలోడీ

ప్రధాని నరేంద్ర మోదీ ఇటలీలో జరుగుతున్న జీ7 శిఖరాగ్ర సమావేశానికి హాజరై తిరిగొచ్చేశారు. ఈ పర్యటనలో ప్రధాని మోదీ వివిధ దేశాల నేతల్ని కలిశారు. కానీ ఇటలీ ప్రధాని మెలోనీతో కలిసిన ఫోటోలు మాత్రం వైరల్ అవుతున్నాయి. మెలోనీ స్వయంగా మోదీతో సెల్ఫీ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో గట్టిగా తిరుగుతున్నాయి. మోదీతో మెలోనీ సెల్ఫీ ఫోటోలపై మీమ్స్ కూడా పెద్దగా వైరల్ అవుతున్నాయి. 

మెలోనీ -మోదీ రెండూ కలిపి మెలోడీ అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ఇద్దరు నేతల ఫోటోలు ఆన్‌లైన్ వేదికల్లో ట్రెండింగ్‌లో ఉన్నాయి.

సేఫ్టీ అండ్ సెక్యూరిటీపై చర్చ

ప్రధాని నరేంద్ర మోదీ ఇటలీలో జరిగిన జీ7 శిఖరాగ్ర సమావేశంలో ఇటలీ దేశాధినేతతో ద్వైపాక్షిక సమావేశం కూడా జరిపారు. సేఫ్టీ అండ్ సెక్యూరిటీపై చర్చించారు.

వాణిజ్య సంబంధాల విస్తరణ

ప్రధాని మోదీ-ఇటలీ భాగస్వామ్యులతో వివిధ అంశాలపై కూలంకషంగా చర్చ జరిగింది. వాణిజ్య వ్యాపారాలు, ఆర్ధిక సహకారం వంటివాటిపై చర్చించారు. 

అంతరిక్షం, విజ్ఞానం సహా వివిధ రంగాల్లో ఇరు దేశాలు ఒప్పందాలపై సంతకాలు కూడా చేశాయి.

ఈ శిఖరాగ్ర సదస్సులో రెండు దేశాల నేతలు పరస్పర సహకారంపై అంగీకారం కుదుర్చుకున్నాయి. మోదీతో ఇతర దేశాధినేతలు ఫోటోలు దిగినా మోదీతో మెలోనీ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link