Actress: 45 ఏళ్ళకి 6000 కోట్ల అధినేతయిన తెలుగు నటుడుని మూడవ పెళ్లి చేసుకున్న కన్నడ నటి..

Tue, 10 Dec 2024-10:48 am,

పవిత్ర లోకేష్ కన్నడ సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి. మైసూరు, కర్ణాటకలో జన్మించిన ఆమె, ప్రముఖ నాటక మరియు సినిమా నటుడు మైసూరు లోకేష్ కుమార్తె. 16 ఏళ్ల వయసులోనే పవిత్ర టెలివిజన్ ద్వారా రంగుల ప్రపంచంలోకి అడుగు పెట్టారు.

అతి తక్కువ సమయంలోనే ఆమె కన్నడ సినిమాల్లో తన ప్రతిభను చాటుకుని, పలు సహాయ పాత్రల ద్వారా ప్రేక్షకుల అభిమానాన్ని పొందారు. పవిత్ర 150కు పైగా కన్నడ చిత్రాల్లో నటించి విశేష గుర్తింపు పొందారు. ఆమె కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటించగా, ఎక్కువగా సహాయక పాత్రలతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు. 

పవిత్ర లోకేష్ వ్యక్తిగత జీవితం కూడా స్నేహితుల మరియు మీడియా వర్గాల్లో చర్చనీయాంశమైంది. మొదటి భర్త సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కాగా, కొన్ని కుటుంబ సమస్యల కారణంగా వీరి పెళ్లి ముగిసింది. తర్వాత ఆమె ప్రముఖ నటుడు సుచింద్ర ప్రసాద్‌ను వివాహం చేసుకున్నారు. కానీ 2018 నుంచి వీరి జీవితం విడిపోవడంతో మరోసారి ఆమె వ్యక్తిగత జీవితం హాట్ టాపిక్ అయింది.

పవిత్ర లోకేష్ తాజాగా టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్‌తో మూడో వివాహం చేసుకున్నారు. నరేష్ కి ఇంతకుముందే రెండు పెళ్ళిళ్ళు అయ్యాయి. వీరి సంబంధం మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది. నరేష్ 6000 కోట్ల ఆస్తుల ఓనర్ కావడంతో, ఈ వివాహం పెద్దగా చర్చనీయాంశమైంది. 

 

ఈ వివాహానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పవిత్ర భవిష్యత్తు గురించి అభిమానులు పెద్ద ఆసక్తి చూపుతున్నారు. సినిమాలు, సీరియల్స్ పక్కన పెడితే పవిత్ర లోకేష్ ఇప్పుడు ఆమె వ్యక్తిగత జీవితం వల పత్రికల్లో ప్రధాన వార్తగా నిలిచారు. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link