Keerthy Suresh: చిందేస్తూ చిల్ అవుతున్న కీర్తి సురేష్.. మహానటిలోని కొత్త యాంగిల్..

Wed, 01 May 2024-8:34 am,

కీర్తి సురేష్ పేరేంట్స్  ఇద్దరు సినీ రంగానికి చెందిన వారు కావడంతో ఈమె బాలనటిగా మలయాళ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆ తర్వాత మలయాళ మూవీ 'గీతాంజలి' సినిమాతో కథానాయికగా పరిచయమైంది.

ఆ తర్వాత తమిళంలో 'ఇదు ఎన్న మాయమ్' మూవీతో అక్కడ కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రంలో కీర్తి సురేష్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. తెలుగులో కీర్తి సురేష్ మొదటి సినిమా 'నేను శైలాజా'. రామ్ పోతినేని హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాతో టాలీవుడ్ ఆడియన్స్‌కు చేరువైంది. 

తెలుగులో కాస్త గ్యాప్‌తో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో, పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన 'అజ్ఞాతవాసి' సినిమాలో నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది.

ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మహానటి సావిత్రి జీవితంపై తెరకెక్కిన 'మహానటి' మూవీలో సావిత్రి గారి పాత్రలో కీర్తి సురేష్ ఒదిగిపోయిన తీరుకు అందరు సలామ్ కొట్టారు. ఈ సినిమాలోని నటనకు మహానటికి జాతీయ ఉత్తమ నటి అవార్డు ఈమె ఖాతాలో చేరింది. 

లాస్ట్ ఇయర్ తెలుగులో నాని సరసన దసరా మూవీతో హిట్ అందుకుంది. ఆ తర్వాత చిరంజీవి హీరోగా నటించిన 'భోళా శంకర్' మూవీలో చిరు చెల్లెలు పాత్రలో నటించింది. 'భోళా శంకర్' సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా వర్కౌట్ కాలేదు.

ఇప్పటి వరకు సౌత్ సినీ సహా అన్ని ఇండస్ట్రీస్‌లో నటించిన కీర్తి సురేష్‌.. త్వరలో 'బేబి జాన్' మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమా విజయ్ హీరోగా నటించిన 'తేరి' మూవీకి రీమేక్‌గా తెరకెక్కుతోంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link