Keerthy Suresh: గోల్డ్ రంగు చీరలో కీర్తి సురేష్.. ధగధగ మెరిసిన హీరోయిన్

Fri, 16 Feb 2024-8:20 pm,

Keerthy Suresh in Saree: నేను శైలజా చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ కీర్తి సురేష్. ఆ తరువాత ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

ముఖ్యంగా మహానటి సినిమా ఆమెకు తెలుగులో ఎంతోమంది అభిమానులను సంపాదించి పెట్టింది. ఈ చిత్రంకి గాని కీర్తి సురేష్ కి నంది అవార్డు సైతం వచ్చింది. 

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో సావిత్రి క్యారెక్టర్ లో కనిపించి కీర్తి సురేష్ అందరిని మెస్మరైజ్ చేసింది.

 కాగా ఈ చిత్రం తర్వాత ఎన్నో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలలో కూడా నటించింది కీర్తి సురేష్. కానీ అవేవీ ఆమెకు పెద్దగా సక్సెస్ తెచ్చి పెట్టలేదు.

ఇక ఈమధ్య వరసగా ఫ్లాపులతో సతమతమైన కీర్తి సురేష్ కి నానితో చేసిన దసరా సినిమా సూపర్ హిట్ అందించింది.

కాగా ఇప్పుడు తెలుగు తమిళ భాషలలో జయం రవి చిత్రం సైరన్ తో ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ చిత్రం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో బ్లాక్ అండ్ గోల్డ్ శారీలో కనిపించి కీర్తి సురేష్ అందరి దృష్టిని ఆకట్టుకుంది.

ఈ చీరలో కీర్తి సురేష్ ఎంతో అందంగా కనిపిస్తూ.. జయం రవితో అలానే సినిమా యూనిట్ తో ఫోజులు ఇచ్చింది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link