Khushi -Janhvi: అక్క జాన్వీ బాటలో సౌత్ సినీ ఇండస్ట్రీపై కన్నేసిన ఖుషీ.. ఆ స్టార్ హీరో కుమారుడి చిత్రంతో తెరంగేట్రం..

Mon, 12 Aug 2024-7:45 am,

జాన్వీ కపూర్.. ఎన్టీఆర్ ‘దేవర’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. అంతేకాదు వరుసగా తెలుగు స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తోంది. ఇపుడు  ఖుషీ కూడా తెలుగు సినిమా నుంచే తెరంగేట్రం చేయబోతుంది.

హీరోయిన్‌గా ఇండస్ట్రీలో లెగ్ పెట్టకముందే  తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే పనిలో పడింది. ఈమె కూడా నందమూరి హీరో సినిమాతోనే దక్షిణాది సినీ ఇండస్ట్రీలోకి రంగ ప్రవేశం చేయబోతున్నట్టు సమాచారం. 

ఖుషీ కపూర్.. శ్రీదేవి, బోనీ కపూర్‌ల రెండో కూతురు. ఈమె 5 నవంబర్ 2000లో జన్మించింది. త్వరలోనే  ఖుషీ బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ సినిమాతో తెరంగేట్రం చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. త్వరలో దీనిపై అఫీషియల్ ప్రకటన వెలుబడాల్సి ఉంది.

ఖుషీ  హిందీ సినిమాతో కాకుండా.. డైరెక్ట్ తెలుగు సినిమాతో ఎంట్రీ ఇవ్వడం ఖాయం అనే చెప్పాలి. ఖుషీ తల్లి శ్రీదేవి, అక్క జాన్వీ బాటలో ప్రేక్షకులను అలరించడానికి ఇప్పటికే యాక్టింగ్, డాన్సింగ్, స్టంట్స్ విషయాల్లో ట్రైయిన్ అయింది కూడా. 

ఖుషీ కపూర్.. ఒక్క సినిమా చేయకపోయినా.. ఈమెకు సోషల్ మీడియాలో ఈమెను ఫాలో అయ్యేవారు భారీ సంఖ్యలోనే ఉన్నారు. సిల్వర్ స్క్రీన్ పై ఖుషీ హీరోయిన్‌గా ఎపుడు ఎంట్రీ ఇస్తే ఆదరించడానికి ఫ్యాన్స్ రెడీగా ఉన్నారు. మరి అంతా అనుకున్నట్టే బాలయ్య కుమారుడి సినిమాతో ఎంట్రీ ఇస్తుందా లేదా అనేది చూడాలి.

శ్రీదేవి గ్లామర్ షో చేసినా.. ఎక్కడా ద్దులు దాటలేదు. కానీ అతిలోకసుందరి కూతుళ్లు  అందాల ఆరబోతలో హద్దులను చెరిపేస్తున్నారు. గ్లామర్ షోలో ఖుషీ కపూర్.. అక్క జాన్వీ కపూర్‌కు గట్టి పోటీ ఇస్తోంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link