AP Liquor Policy: షాపులు ఒదిలేసి వెళ్లిపోండి.. మద్యం వ్యాపారులకు మద్యం సిండికేట్ మాస్ వార్నింగ్..

Tue, 15 Oct 2024-8:50 am,

ఇప్పటికే లాటరీలో మద్యం షాపులను దక్కించుకున్న మద్యం వ్యాపారులు అందుకు త్వర త్వరగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కొత్త మద్యం షాపులకు లాటరీ ప్రక్రియ ముగియడంతో ఏపీలో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి.

లాటరీలో విజేతలుగా నిలిచి లైసెన్సులు దక్కించుకున్న కొంత మందికి కొన్ని నియోజకవర్గాల్లోని ముఖ్య నాయకులు, మద్యం సిండికేట్ల నుంచి ఒత్తిళ్లు ఎదురవుతున్నాయి.

నియోజకవర్గ పరిధిలో వ్యాపారం చేయాలంటే  20 శాతం వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే ఇక్కడ వ్యాపారం ఎలా చేస్తారో చూస్తా మంటూ బెదిరింపులకు దిగుతున్నారు.

మరికొందరు గుడ్‌ విల్‌ ఇస్తాం వదిలి వెళ్ళి పోవాలని ఒత్తిడి తెస్తున్నారట. రేపటి నుంచి  మద్యం దుకాణాలు తెరుచుకోనున్న నేపథ్యంలో ఈ బెదిరింపులు మరింత  ఎక్కువయ్యాయి.

 

లాటరీ ద్వారా ఎంపికయిన వారికీ  లిక్కర్  షాపులను అప్పగించనున్నారు. ఈ నెల 16 నుంచి రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీ అమల్లోకి రానుంది.

ఏపీలో కొత్తగా తీసుకొచ్చిన మద్యం విధానంలో లిక్కర్ ను తక్కువ ధరలకు తగ్గించి అతి తక్కువ ధరకే అందించడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసుకుంది. ఇప్పటికే కొత్త మద్య విధానంపై ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే కదా.

 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link