Paris Olympics 2024: 16 ఏళ్లకే స్వర్ణం.. ఒలింపిక్స్ లో బోణి కొట్టిన మనూబాకర్ గురించి ఈ విషయాలు తెలుసా..?

Sun, 28 Jul 2024-7:38 pm,

మను భాకర్ హర్యానాలోని ఝుజ్జర్ జిల్లా గోరియా గ్రామంలో జన్మించింది. ఆమె తండ్రి రామ్ కిషన్ భాకర్  మెరైన్ ఇంజినీర్ కాగా.. ఆమె తల్లి ఓ ప్రిన్సిపల్. మనుకి చిన్నప్పటి నుంచే క్రీడలంటే ఎంతో ఇష్టం. మమెలోని ఈ అభిరుచిని గుర్తించిన తల్లిదండ్రులు.. ఆమెకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. 14 ఏళ్ల నుంచి మణిపురి మార్షల్ ఆర్ట్ అయిన హుయెన్ లాంగ్లాన్ వంటి క్రీడల్లో మను రాణిచింది.

అలాగే బాక్సింగ్, టెన్నిస్, స్కేటింగ్ వంటి ఈవెంట్ లలో జాతీయ, అంతర్జాతీయ పతకాలను గెలుచుకుంది. షూటింగ్‌లో తనకు ఎక్కువ మక్కువ ఉండటంతో.. దానిపైనే పూర్తి ఫోకస్ పెట్టింది. 2017లో కేరళలో జరిగిన నేషనల్ ఛాంపియన్‌షిప్‌లో మను ఏకంగా 9 బంగారు పతకాలను సాధించింది. ఆ తర్వాత 2018లో జరిగిన కామన్‌వెల్త్ గేమ్స్‌లో 16 ఏళ్ల వయసులోనే బంగారు మెడల్ గెలుపొందింది. ఇప్పుడు ఒలంపిక్స్‌లోనూ సత్తా చాటి, సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.

మెక్సికోలోని గ్వాడలజారాలో జరిగిన 2018 ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ వరల్డ్ కప్‌లో,  భాకర్ మహిళల 10 -మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో రెండుసార్లు ఛాంపియన్ అయిన మెక్సికోకు చెందిన అలెజాండ్రా జవాలాను ఓడించి బంగారు పతకాన్ని గెలుచుకుంది.

16 సంవత్సరాల వయస్సులో బంగారు పతకాన్ని గెలుచుకోవడం ద్వారా, ప్రపంచ కప్‌లో బంగారు పతకాన్ని గెలుచుకున్న అతి పిన్న వయస్కుడైన భారతీయురాలిగా భాకర్ రికార్డు క్రియేట్ చేసింది. ప్రపంచ కప్‌లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో భాకర్ తన రెండవ బంగారు పతకాన్ని గెలుచుకుంది. 

 ప్రస్తుతం..మను 2024 పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకుంది.  ఒలింపిక్స్‌లో షూటింగ్ పతకాన్ని గెలుచుకున్న భారతదేశం నుండి మొదటి మహిళా షూటర్‌గా నిలిచింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో ఆమె ఫైనల్‌లో 221.7 స్కోరుతో గెలిచింది.

షూటర్ మను భాకర్ 2024 పారిస్ ఒలింపిక్స్‌లో చాటెరోక్స్ షూటింగ్ సెంటర్‌లో జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్‌లో కాంస్యం సాధించి భారతదేశానికి మొదటి పతకాన్ని సాధించింది. ఒలింపిక్ గేమ్స్‌లో షూటింగ్‌లో పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా భాకర్ చరిత్ర సృష్టించింది.   

ఇదిలా ఉంటే, అర్జున్ బాబుటా, రమితా జిందాల్ కూడా పురుషులు, మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్స్‌కు అర్హత సాధించడం ద్వారా భారత్ కు మరిన్ని పతకాల పంట పండనున్నట్లు తెలుస్తోంది. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link