Manushi Chillar: మాజీ ముఖ్యమంత్రి మనవడితో మానుషి ప్రేమాయణం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Wed, 31 Jul 2024-7:20 pm,

మిస్ వరల్డ్ విన్నర్ గా పేరు తెచ్చుకున్న మానుషి చిల్లర్.. బాలీవుడ్ లో నటిగా కూడా ముందుకు దూసుకు వెళుతున్నారు. ఇప్పటికే పలు బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న మానుషి.. ఈ మధ్యనే వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఆపరేషన్ వాలెంటైన్ సినిమాతో.. తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం అయింది.   

సినిమా పెద్దగా హిట్ అవ్వకపోవడంతో ఈమెకు ఆఫర్లు రాలేదు. అయితే హిందీ సినిమాలతో బాగానే నెట్టుకొస్తున్న మానుషి.. ప్రస్తుతం తన వ్యక్తిగత జీవితం కారణంగా వార్తల్లో నిలిచింది. గత కొంతకాలంగా ఈమె ఒకరితో పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతుంది అని.. బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది.   

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడు వీర్ పహారియాతో.. ఈమె డేటింగ్ చేస్తోంది అని వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఓరి ఈ మధ్యనే ఒక వీడియో షేర్ చేశారు. అందులో జాన్వి కపూర్ తన బాయ్ ఫ్రెండ్ శిఖర్ పహరియా.. ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ తో టూర్ కి వెళ్లినట్లు తెలుస్తోంది.   

అందులో వీర్ పహారియా కూడా ఉన్నారు. అదే ఫోటోలో మానుషి చిల్లర్ వీర్ బుజం మీద సేద తీరుతూ కనిపించింది. దీంతో వీళ్లిద్దరి మధ్య ఏదో నడుస్తుంది అని వార్తలు మొదలయ్యాయి. వీళ్ళిద్దరూ చాలా కాలంగా డేటింగ్ చేస్తున్నారు అంటూ.. బాలీవుడ్ లో చాలానే కథనాలు బయటకు వచ్చాయి. కానీ ఇద్దరిలో ఎవరు దీని గురించి స్పందించలేదు. 

వీర్ పహారియా కూడా నటుడిగా ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు అతని సోదరుడు శిఖర్ పహారియా వ్యాపారవేత్తగా ఉన్నారు. శిఖర్ జాన్వీ కపూర్ చాలాకాలంగా మంచి స్నేహితులు. వీళ్ళిద్దరూ కూడా చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారు అని సమాచారం.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link