Nayanthara: కావాలంటే గిచ్చి చూడండి.. ఆ రూమర్స్‌పై మండి పడిన నయనతార.. అసలు స్టోరీ ఏంటంటే..?

Mon, 28 Oct 2024-1:27 pm,

నయనతార తరచుగా వార్తలలో ఉంటునే ఉంటారు. కొన్నిసార్లు సినిమాల పరంగా వార్తలలో ఉంటే, మరికొన్నిసార్లు వివాదస్పద అంశాలతో కూడా వార్తలలో ఉంటారు.  తాజాగా, నటి నయన తార ఒక కాస్మోటిక్ సర్జరీ చేసుకున్నారని, అది పూర్తిగా ఫెయిల్ అయ్యిందని కూడా సోషల్ మీడియాలో పుకార్లు చక్కర్లు కొట్టాయి.

దీంతో ఆమె అభిమానులు ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తొంది. ఆమె ఫారీన్ కు వెళ్లి మరీ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారని కూడా నెట్టింట తెగ ప్రచారం జరిగింది. దీంతో నయన తార తాజాగా, దీనిపై స్పందించారు. 

నయన తార ఇటీవల ఒక ఇంటర్వ్యూలో దీనిపై మాట్లాడారు. తనకు హైబ్రోస్ అంటే ఎంతో ఇష్టమని, తరచుగా విభిన్న రకాలుగా హైబ్రోస్ సెట్ చేసుకుంటు ఉంటానని నటి నయన తార చెప్పుకొచ్చారు. దీని వల్ల కొన్నిసార్లు ముఖం లావుగాను లేకపోతే సన్నగా కన్పిస్తుందన్నారు. 

అంత మాత్రన ముఖం పాడైపోయిందనడం, ఏదో కాస్మోటిక్ సర్జరీ చేయించుకున్నని పుకార్లు వ్యాప్తి చేయడం కరెక్ట్ కాదన్నారు. కావాలంటే.. తన దగ్గరకు వచ్చి ముఖాన్ని గిచ్చిచూడాలని కూడా సెటైర్ లు వేశారు. ఇలాంటి లేనీ పోనీ రూమర్స్ వ్యాప్తి చేయడం మానుకొవాలన్నారు. 

కొన్నిసినిమాల కోసం డైటింగ్  కూడా చేయాల్సి వస్తుందని అప్పుడు ముఖంలో పలు మార్పులు వస్తాయని, అంత మాత్రన.. ఏదో చేసుకున్నామని అనుకుంటే  ఎలాగంటూ ఫైర్ అయ్యారు. తాను ఎలాంటి సర్జరీలు చేసుకొలేదని క్లారిటీ ఇచ్చారు.  

ఇదిలా ఉండగా.. నయనతార ప్రస్తుతం  తెలుగు, హింది, ఇంగ్లీష్ సినిమాల్లో బిజీగా ఉంటున్నారు. గతేడాది మూడు సినిమాలు చేసిన నయనతార ప్రస్తుతం ఐదు సినిమాలతో బిజీగా ఉన్నారని తెలుస్తొంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link