Vijayadashami Horoscope: దేవీ నవరాత్రుల వేళ ఈ 6 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!

Sun, 06 Oct 2024-11:45 am,

దేవీ నవరాత్రులు.. దేశవ్యాప్తంగా ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు.  ముఖ్యంగా ఈ నవరాత్రులలో అమ్మవారు ఒక్కో రూపాన్ని దాల్చుతూ భక్తులకు దర్శనమిస్తారు. ఈ నేపథ్యంలోనే ప్రత్యేకించి కొన్ని రాశుల వారికి అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని, ఆ అమ్మవారి కృపాకటాక్షం కారణంగా ఈ రాశుల వారికి ధన , ధాన్య , సంతానయోగం కలగబోతోందని పండితులు చెబుతున్నారు.

వృషభం..

ఈ రాశికి అధిపతి అయిన శుక్రుడు , తన స్వక్షేత్రమైన తులా రాశిలో సంచారం చేస్తున్న కారణంగా కుటుంబంలో సుఖసంతోషాలకు కొరత ఉండదు. ఆర్థిక సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి.. శుభవార్తలు వింటారు. ఆదాయ ప్రయత్నాలన్నీ విజయవంతం అవుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది 

మిధునం..

ఈ రాశి అధిపతి బుధుడు స్వక్షేత్రంలోనే కాక వచ్చే స్థితిలో కూడా ఉండడంతో పాటు శని,  శుక్రులు కూడా అనుకూలంగా ఉన్న నేపథ్యంలో విజయాలు సాఫల్యాలు ఎక్కువగా ఉంటాయి. ప్రముఖులతో పరిచయాలు పెరిగి పలుకుబడి పెరుగుతుంది.  మనసులోని కోరికలు నెరవేరుతాయి. 

కన్యారాశి..

కన్య రాశికి అధిపతి అయిన బుధుడు ఇదే రాశుల ఉండడం వల్ల ధనస్థానంలో ధనాధిపతి  శుక్రుడు సంచారం చేస్తున్నందువల్ల ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంటుంది . ఉద్యోగంలో ఉన్నత స్థాయికి చేరుకోవడమే కాదు జీతం కూడా పెరుగుతుంది.  ఆర్థిక సమస్యల నుంచి పూర్తిగా బయటపడతారు.

తులారాశి..

తులారాశి వారికి శుక్రుడు ఇదే రాశిలో సంచారం చేయడం వల్ల మహాభాగ్యం పట్టుకోబోతోందని సమాచారం.  అనేక వైపుల నుంచి ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగంలో హోదాలు పెరుగుతాయి. ఉద్యోగులకు విదేశీ అవకాశాలు అంది వస్తాయి.

మకర రాశి..

ఈ రాశి వారికి శని ధనస్థానంలో ఉండడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఉద్యోగ , పెళ్లి ప్రయత్నాలకు ఊహించని స్పందన లభిస్తుంది. తండ్రి వైపు నుంచి ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి.   

కుంభరాశి..

ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే. ఉద్యోగంలో త్వరగా పురోగతి లభిస్తుంది.ఉద్యోగ,  పెళ్లి ప్రయత్నాలు విదేశీ అవకాశాలు లభిస్తాయి. వృత్తి , ఉద్యోగాల రీత్యా విదేశీ ప్రయాణాలు చేయవలసి వస్తుంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link