Ram charan: 13 ఏళ్ల కెరీర్..నో చెప్పిన ఆ ఐదు సినిమాలివే

Tue, 01 Dec 2020-10:16 pm,

దర్శకుడు గౌతమ్, మణిరత్నం ల ఆఫర్ లను కూడా చెర్రీ తిరస్కరించాడు. అయితే వేరే ఇతర కారణాలతోనే నిరాకరించినట్టు స్వయంగా చెర్రీ చెప్పాడు.

దర్శకుడు పూరీ జగన్నాథ్ తీసిన చిరుత సినిమా అప్పట్లో 20 కోట్లు వసూలు చేసి నిర్మాతకు లాభాలు అందించింది. సెలెక్షన్ ఆఫ్ సినిమాల్లో చెర్రీ చూపిస్తున్న ప్రావీణ్యతే అతనికి విజయాలందిస్తోంది.

దర్శకుడు గౌతమ్...సూర్య సన్నాఫ్ కృష్ణన్ కధను ముందు రామ్ చరణ్ కు విన్పించాడు. అయితే చిరుత విడుదలై అప్పటికి ఏడాదే కావడంతో సాఫ్ట్ సినిమా వద్దనుకున్నాడు. నిరాకరించాడు. సూర్య హీరోగా విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 

దర్శకుడు గౌతమ్ ఎటో వెళ్లిపోయింది మనసు కధను ముందు చెర్రీకే విన్పించాడు. ఆరెంజ్ డిజాస్టర్ ఫెయిల్ కావడంతో లవ్ స్టోరీలు వద్దనుకుని కాదని చెప్పాడు చెర్రీ. ఇక ఆ సినిమా నానీ హీరోగా విడుదలైంది. 

గీతాంజలి లాంటి క్లాసిక్ సినిమా తరువాత టాప్ డైరెక్టర్ మణిరత్నం రామ్ చరణ్ కోసం ఓకే బంగారం కధ విన్పించాడు. ఆ సమయంలో బ్రూస్లీ సినిమాతో బిజిగా ఉన్న కారణంగా చెర్రీ నిరాకరించాడు. ఆ తరువాత దుల్కర్ సల్మాన్ హీరోగా విడుదలైంది.

వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ రాజా వరుస విజయాల్ని అందించిన మేర్లపాక గాంధీ..కృష్ణార్జున యుద్ధం కధతో రామ్ చరణ్ దగ్గరకు వెళ్లాడు. అయితే ద్విపాత్రాభినయం, రొటీన్ కధ కావడంతో నిరాకరించాడు చెర్రీ. తరువాత ఇదే సినిమా నానీ హీరోగా విడుదలైంది.

సోగ్గాడే చిన్ని నాయన, రారండోయ్ వేడుక చూద్దాం విజయాలతో నేల టిక్కెట్టు కధతో రామ్ చరణ్ దగ్గరకు వెళ్లాడు దర్శకుడు కృష్ణ కురసాల. కధ నచ్చకపోవడంతో చెర్రీ నో చెప్పాడు. అనంతరం ఈ సినిమా రవితేజ హీరోగా విడుదలైంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link