Rashmika Mandanna: పెద్ద మనసు చాటుకున్న రష్మిక మందన్న.. కేరళ వరద బాధితులకు నేషనల్ క్రష్ భారీ విరాళం..

Sat, 03 Aug 2024-1:24 pm,

ఇప్పటికే కేరళ రాష్ట్రంలోని వాయనాడ్ లో జరిగిన ప్రకృతి విలయానికి ఎంతో మంది కన్నుమూసారు. జాతి యావత్తు కూడా ఈ విపత్తుపై తమ వంతు విచారాన్ని వ్యక్తం చేసారు. ఇప్పటికే పలువురు సినీ నటులు ఆర్ధికంగా కేరళకు తమ వంతు సాయం అందించారు.తాజాగా రష్మిక మందన్న కేరళ వరద బాధితుల సహాయార్ధం రూ. 10 లక్షలను కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కు అందజేసి తన పెద్ద మనసు చాటుకుంది.

ఇప్పటికే కేరళలో సంభంచిన ప్రకృతి విలయానికి కేంద్రానికి చెందిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు కేరళలోని ప్రకృతి విపత్తు దళంతో పాటు  ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులతో పాటు వివిధ స్వచ్ఛంద సంస్థలకు చెందిన వ్యక్తులు రంగంలోకి దిగి బాధితులకు తమ వంతు సాయం అందిస్తున్నారు.

ఇప్పటికే మలయాళ చిత్ర పరిశ్రమ ఈ ఘటనపై తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేసింది. అక్కడ నెల రోజుల పటు సినిమాకు సంబంధించిన ఈవెంట్స్ ఏవి నిర్వహించకూడదనే నిర్ణయానికి వచ్చింది.

రష్మిక మందన్న విషయానికొస్తే.. అసలు సిసలు  ప్యాన్ ఇండియా హీరోయిన్ గా తెలుగు నుంచి తమిళం వయా హిందీ అన్ని భాషల్లో సత్తా చూపెడుతోంది. 

రష్మిక మందన్న 2020లోనే నేషనల్ క్రష్‌గా ఎంపికై సంచలనం రేపింది. బాలీవుడ్లో బిగ్‌బీతో కలిసి గుడ్ బై మూవీ తొలిసారి హిందీ చిత్ర పరిశ్రమలో ప్రవేశించింది. త్వరలో పుష్ప - ది రూల్ మూవీతో పలకరించబోతుంది. తాజాగా ఈ సినిమా ఆగష్టు 15 నుంచి డిసెంబర్ 6కు పోస్ట్ పోన్ అయింది.

ప్రస్తుతం రష్మిక మందన్న సల్మాన్ ఖాన్, మురుగదాస్ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ చేస్తోంది. అటు ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీలో ఈ కన్నడ కస్తూరినే ఫిక్స్ చేసినట్టు సమాచారం.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link