RRR సినిమాపై చిత్రాలు వేస్తున్న ఫ్యాన్స్

Sun, 09 Feb 2020-2:45 pm,

తాజాగా RRR మూవీ.. విడుదలకు ముందే సంచలనాలు సృష్టిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన నైజాం థియేరిటికల్ హక్కులను ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు 72 కోట్ల రూపాయలకు సొంతం చేసుకున్నాడు. మరోవైపు ఆంధ్రప్రదేశ్, మిగతా రాష్ట్రాలకు సంబంధించిన బిజినెస్ కావాల్సి ఉంది. 

అటు ఈ సినిమాపై ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు. ఐతే విడుదల తేదీ ఆలస్యం కావడంతో.. కాస్త నిరాశలో ఉన్నారు. మరోవైపు సినిమా కోసం ఎదురు చూస్తున్న కొంత మంది ఫ్యాన్స్ .. ఈ లోగా తమ అభిమాన తారల చిత్రాలు వేస్తున్నారు. 

సినిమాలో మెగా పవర్ స్టార్  రామ్ చరణ్ తుపాకీ ఎక్కుపెట్టినట్లుగా చిత్రాలు వేశారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ విల్లు ఎక్కుపెట్టినట్లుగా వేసిన పెయింటింగ్స్ ఆకట్టుకుంటున్నాయి.

దీనిపై చిత్ర దర్శక నిర్మాతలు సంతోషం వ్యక్తం చేశారు. RRR సినిమా పేరుతో ఏర్పాటు చేసిన ట్విట్టర్ లో ఆ  చిత్రాలను పోస్టు చేశారు. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link