Samantha: అప్పుడు నన్ను ఎవరు పట్టించుకోలేదు.. మరోసారి షాకింగ్ నిజాలు బైటపెట్టిన సమంతా.. అసలేం జరిగిందంటే..?

Fri, 18 Oct 2024-12:53 pm,

హీరోయిన్ సమంతా ప్రస్తుతం తెగ వార్తలలో ఉంటున్నారు. ఇటీవల తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలతో ఆమె మరోసారి హాట్ టాపిక్ గా మారిపోయారు. ఈ వ్యాఖ్యల మీద ఇంకా పెద్ద రచ్చ కొనసాగుతుంది.

అయితే.. కొండా సురేఖ వ్యాఖ్యల్ని ఖండిస్తు సినిమా ఇండస్ట్రీతో పాటు, రాజకీయ నేతలు సైతం సమంతకు అండగా నిలిచారు. ఇదిలా ఉండగా..తాజాగా జిగ్రా మూవీ ఈవెంట్ లో సమంతా పాల్గొన్నారు. చాలా రోజుల తర్వాత ఆమె మళ్లీ ఆడియన్స్ ముందుకు వచ్చి మాట్లాడారు.

అప్పుడు కూడా ఆమె చాలా ఎమోషనల్ అయ్యారు. ఆ ఈవెంట్ లో త్రివిక్రమ్, దగ్గుబాటి రాణా,ఆలియాభట్ లను  ప్రశంసించారు. అదే విధంగా ఆలియాభట్ సైతం.. సమంతను ఒక రేంజ్ లో ఆకాశానికి ఎత్తేశారు. సమంతా ధైర్యవంతురాలని, ఆమె ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ఇలా ధైర్యంగా ఉందన్నారు.

ఇదిలా ఉండగా.. గతంలో కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల్ని ఖండించిన సమంతా.. మళ్లీ సురేఖ వ్యాఖ్యలపై ఘాటుగానే స్పందించారు.  అయితే..సమంతా గతంలో తాను.. మయోసైటిస్ తో బాధపడుతున్న రోజుల్ని మరోసారి గుర్తు చేసుకున్నారు.  

సమంతా సిటాడెల్  ప్రమోషన్ లో భాగంగా మాట్లాడారు. గతంలో మయోసైటిస్ వచ్చినప్పుడు.. తాను ఎంతో బాధపడేదాన్ని అని చెప్పుకొచ్చారు. అప్పుడు ఒక్కసారిగా అంత మర్చిపోయినట్లు అన్పించేందన్నారు. తన హెల్త్ గురించి ఎవరు పట్టించుకున్నారో కూడా మర్చిపోయానన్నారు. కొన్నిసార్లు తనను ఎవరు కూడా ఆస్పత్రికి తీసుకెళ్లలేదని, పట్టించుకొలేదని అన్పింస్తుంటూ కామెంట్లు చేశారు.  

తాను పూర్తిగా కోలుకోని సెట్స్ పైకి వచ్చే వరకు కూడా ఓపిగ్గా వెయిట్ చేసిన నిర్మాతలకు స్పెషల్ గా ధన్యవాదాలు అంటూ సమంతా మాట్లాడారు. ఖుషీ మూవీ తర్వాత సామ్ స్క్రీన్ మీద కన్పించలేదు. 

మరోవైపు సమంతా ప్రధాన పాత్రలో.. నటించిన వెబ్ సిరిస్ లు సిటాడెల్, హనీ బన్ని స్ట్రీమింగ్ కు రెడీ అవుతుంది. నవంబర్ 7 నుంచి ఈ సిరిస్ అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తొంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link