Theppa Samudram: ప్రముఖ ఓటీటీలోకి వచ్చేసిన సస్పెన్స్ థ్రిల్లర్ `తెప్ప సముద్రం`..

Sat, 03 Aug 2024-10:20 am,

బిగ్ బాస్ ఫేమ్ అర్జున్ అంబటి చైతన్య రావు  హీరోలుగా నటించిన చిత్రం ‘తెప్ప సముద్రం’.సతీష్ రాపోలు దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఓ మోస్తరు విజయం సాధించింది.

బేబి వైష్ణవి సమర్పణలో శ్రీమణి ఎంటర్టైన్మైంట్స్ పతాకంపై నీరుకంటి మంజులా రాఘవేంద్ర గౌత్ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించారు. తాజాగా ‘తెప్ప సముద్రం’ సినిమా ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆహాలో ఆగష్టు 3 అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్ కు వచ్చేసింది.

తెలంగాణలోని తెప్ప సముద్రం అనే ఊళ్లో అనుకోకుండా చిన్న పిల్లలను కిడ్నాప్ చేస్తుంటారు.  వారి ఆచూకి కోసం తల్లితండ్రలు ఎంతో అవేధన చెందుతూ ఉంటారు.  ఆ ఊరికి చెందిన  ఎస్.ఐ చిన్న పిల్లల మాయం ఎందుకు అవుతున్నారనే విషయమై ఇన్విష్టిగేషన్ లో ఎలాంటి విషయాలు బయపడ్డాయనేది ఎంతో ఆసక్తి రేకిస్తోంది.

క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా కథాంశంతో తెరకెక్కించిన ఈ సినిమా ఆహా ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి గ్రిప్సింగ్ త్రిల్లర్ గా తెరకెక్కించిన ఈ సినిమాను భవానీ మీడియా డిజిటల్ డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది.

ఎంగేజింగ్ కంటెంట్ తో అడుగడున ఉత్కంఠ రేకెత్తించే 'తెప్ప సముద్రం' ఈ వీకెండ్ ఆహా ఓటీటీ లో తప్పకుండా చూడాల్సిన చిత్రాల్లో ఇది ఒకటి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link