భాగ్యనగర ప్రజల కోసం టీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో ఏం ఉందంటే!

Mon, 23 Nov 2020-6:29 pm,

సీఎం కేసీఆర్ ఢిల్లీ తరహాలో కొన్ని కార్యక్రమాలను ప్రారభించేలా మ్యానిఫెస్టోను సిద్ధం చేశారు. ప్రతీ ఇంటికి ఉచిత మంచినీటి సరఫరా ఇలా ప్రతీ నెల 20 వేల లీటర్లను సరఫరా చేయనున్నారు.  

డిసెంబర్ నెల నుంచే ఉచిత నీటి సరఫరాను పొందే అవకాశం ఉంది. తరువాత ఎలాంటి నీటి బిల్లులు ఉండవు.

కొత్తగా రాయదుర్గం నుంచి ఎయిర్ పోర్టు, BHEL నుంచి మెహిదీపట్న మెట్రో ట్రైన్ సర్వీసు

నాయి బ్రాహ్మణులు, ధోబీ ఘాట్లు, లాండ్రీ సర్వీసులు చేసేవారికి ఉచిత విద్యుత్తు

కోవిడ్-19 సమయంలో మోటార్ వెహికల్ ట్యాక్స్ చెల్లింపులను మినహాయింపు.. మొత్తం రూ.267 కోట్ల వరకు రాయితీ ( మార్చి నుంచి సెప్టెంబర్ )

అన్ని పరిశ్రమలు, వాణిజ్య సంస్థలకు మినిమం డిమాండ్ చార్జీలను మార్చి నుంచి సెప్టెంబర్ వరకు తగ్గించునున్నారు.  

తెలంగాణ రాష్ట్రం కొత్తగా నాలా చట్టం తీసుకురానుంది. దానికి అధికా ప్రాధాన్యత ఇవ్వనుంది.

పది కోట్లలోపు బడ్జెట్ ఉన్న సినిమాలకు జీఎస్టీ ఉండదు అని తెలిపారు.

నగరంలో ఇకపై వైర్లు లేని సిగ్నల్స్ ఏర్పాటు చేయనున్నారని మ్యానిఫెస్టో తెలిపింది.

హైటెన్షన్ వైర్లను నేలలోపే విస్తరించనున్నారు.

( Feature Image: TRS\Twitter )  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link