Aadhaar Cord Update: ఆధార్ కార్డు ఉన్న వారికి మరో గుడ్ న్యూస్.. యూఐడీఏఐ తాజా నిర్ణయం ఇదే..

Tue, 12 Mar 2024-1:41 pm,

ఆధార్ కార్డు అనేది ఒక ముఖ్యమైన గుర్తింపు కార్డుగా మారిపోయింది. బ్యాంక్ లో అకౌంట్ తీయాలన్న, ప్రభుత్వ పథకాలు లబ్దిదారుడికి రావాలన్న కూడా ఆధార్ కార్డు తప్పనిసరిగా మారిపోయింది.   

దీన్ని యూఐడీఏఐ ఆధినంలో ఉంది. మైగావ్ పోర్టల్ లలో మన ఆధార్ కార్డులోని నమోదైన పొరపాట్లను అప్ డేట్ చేసుకొవచ్చు. ఇప్పటికే అనేక మార్లు ఆధార్ కార్డు అప్ డేట్ చేసుకొవడానికి యూఐడీఏఐ అవకాశం కల్పించింది.   

తాజాగా, మరోసారి ఆధార్ కార్డు అప్ డేట్ పొడిగించుకోవడానికి యూఐడీఏఐ అవకాశం కల్పించింది. మై ఆధార్ పోర్టల్ ద్వారా ఈ సేవలు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. ఈవైన మార్పులుంటే దీంట్లో లాగిన్ కావోచ్చని తెలిపింది.  

గతంలో ఆధార్ సెంటర్లలో రూ. 50 ఫీజు చెల్లించి, మార్చి 14, 2024 వరకు ఆధార్ కార్డును ఫ్రీగా అప్ డేట్ చేయడానికి గడువుగా నిర్ణయించి విషయం తెలిసిందే.   

తాజాగా, ఈ గడువును మరో మూడు నెలల పాటు అంటే.. 2024, జూన్ 14 వరకు ఉచితంగా ఎలాంటి మార్పులనైన చేసుకొవచ్చని యూఐడీఏఐ వెల్లడించింది.  ప్రజలు ఈ అవకాశం ను సద్వినియోగం చేసుకొవాలని కూడా కొరింది.   

ఇదిలా ఉండగా మరోసారి ఆధార్ కార్డు అప్ డేట్ అవకాశంతో ప్రజలు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికి కూడా చాలా  మంది తమ వివరాలను అప్ డేట్ చేసుకొలేదని సమాచారం. ఈ పొడిగింపు అలాంటి వారికి ఉపయోగపడుతుందని తెలుస్తుంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link