Unknown Facts About Mukesh Ambani: ముఖేష్ అంబానీ చదువుకున్న ఖరీదైన స్కూల్ ఇదే.. ఒక్కరోజు ఫీజు ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..

Sun, 10 Mar 2024-5:33 pm,

ఎందరో వ్యాపారవేత్తలు చదువుకున్న సింధియా పాఠశాల గ్వాలియర్‌లో సమీపంలో ఉంది. ఇది అన్ని పాఠశాలల కంటే ఎంతో భిన్నంగా ఉంటుంది. దీనిని వెయ్యికి పైగా సంవత్సరాలు కలిగిన ఓ పురాతనమైన కోటలో నిర్మించారు.  

గ్వాలియర్‌లోని సింధియా స్కూల్ ని 1897లో మాధవరావు మహారాజు ప్రారంభించారు. ఈ స్కూల్లో ముకేశ్ అంబానీనే కాకుండా బాలీవుడ్ ప్రముఖ హీరో సల్మాన్ ఖాన్ కూడా చదువుకున్నారు.  

ఈ పాఠశాలలో చదవడానికి డబ్బు ఉండడమే కాకుండా.. వారు పెట్టే అడ్మిషన్ కామన్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (CAA) ఆప్టిట్యూడ్ టెస్ట్‌ను కూడా పాస్ అవ్వాల్సి ఉంటుంది. ఈ టెస్టులో ఉత్తీర్ణత సాధించిన వారికే ఈ స్కూల్లో చదువుకునే అవకాశం లభిస్తుంది. 

అడ్మిషన్ కామన్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (CAA) ఆప్టిట్యూడ్ టెస్ట్‌లో మొత్తం నాలుగు సబ్జెక్టులకు సంబంధించిన పరీక్షలు ఉంటాయి. ఈ పరీక్షల్లో ఒకటి ఫెయిల్ అయిన సీటు రావడం కష్టమని సమాచారం. అలాగే అప్పట్లోనే ఈ స్కూల్లో చదివే వారికి ప్రీమియం లుక్ లో కనిపించేందుకు యూనిఫామ్ కూడా ఉండేదని తెలుస్తోంది.  

ఈ గ్వాలియర్‌లోని సింధియా పాఠశాలలో అంబానీతో పాటు సూరజ్ బర్జాతియా, అనురాగ్ కశ్యప్, అలీ అస్గర్ లు కూడా చదువుకున్నారు. అలాగే ఈ స్కూల్లో ఇతర దేశాలకు సంబంధించిన పిల్లలు కూడా చదువుకునే వారిని సమాచారం.

ఈ పాఠశాలలో చదువుకోవడానికి 11 నుంచి 13 సంవత్సరాల వయస్సు గల విద్యార్థులకు మాత్రమే అడ్మిషన్లు లభించేవి. అలాగే ఈ స్కూల్లో కేవలం 6 నుంచి 8 తరగతులు మాత్రమే ఉండేవి. దీంతోపాటు ఈ స్కూల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు పై తరగతుల్లో ప్రవేశం కూడా ఉండేది కాదట.  

ఇక ఈ స్కూల్‌కి సంబంధించిన ఫీజు వివరాల్లోకి వెళితే.. అప్పట్లోనే ఈ పాఠశాలలో చదువుకునే వారు సంవత్సరానికి రూ. 13,25,000 ఫీజు చెల్లించేవారని సమాచారం. అంతేకాకుండా ఈ పాఠశాలలో బుక్స్‌కి కూడా అదనంగా ఫీజు చెల్లించేవారట.

ఇక ఈ స్కూల్‌కి సంబంధించిన ఫీజు వివరాల్లోకి వెళితే.. అప్పట్లోనే ఈ పాఠశాలలో చదువుకునే వారు సంవత్సరానికి రూ. 13,25,000 (ఒక రోజుకుని రూ.4 వేలకు పైగా)ఫీజు చెల్లించేవారని సమాచారం. అంతేకాకుండా ఈ పాఠశాలలో బుక్స్‌కి కూడా అదనంగా ఫీజు చెల్లించేవారట.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link