Ranu Mandal: ఓవర్‌ నైట్‌ స్టార్‌ సింగర్‌గా మారిన ఆ యాచకురాలు ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..! పరిస్థితి మరింత దారుణం

Sat, 17 Aug 2024-1:11 pm,

రేణు మండల్ గాత్రం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమె దశ తిరిగిపోయింది. సంగీత దర్శకుడు, గాయకుడు హిమేష్ రేష్మియా పిలిపించి బాలీవుడ్‌లో అవకాశం ఇచ్చారు.  

సినిమాల్లో పాటలు పాడి మరింత ఫేమస్ అయ్యారు రేణు మండల్. ఆషికీ మేరీ అనే పాటతో బాగా క్రేజ్ వచ్చింది.   

2019లో రేణు మండల్ బాగా వార్తల్లో నిలిచారు. అయితే ఆమె ఇప్పుడు ఎక్కడ ఉన్నారు..? ఏం చేస్తున్నారు..? అని చాలామంది ఆసక్తిగా వెతుకుతున్నారు.  

బాలీవుడ్‌లో అవకాశాలు తగ్గిపోయిన తరువాత అద్దె చెల్లించేందుకు డబ్బులు లేక ముంబైలో ఇంటిని రేణు మండల్ ఖాళీ చేశారు.  

కోల్‌కతాకు తిరిగి వచ్చి.. ఒక చిన్న ఇంట్లో నివసిస్తున్నారు. ఆమె ఎలా ఉన్నారని వెతుక్కుంటూ ఓ యూట్యూబ్ వ్లాగర్ వెళ్లాడు.  

అయితే తనను చూసేందుకు వచ్చిన వారి ముందు రేణు మండల్ వింత కోరికలు పెడుతున్నారట.   

ఆహారం, వంట సామాగ్రి తీసుకురావాలని కోరుతున్నారట. ఆమె పరిస్థితి దయనీయంగా ఉందని ఆ యూట్యూబర్ చెప్పాడు.  

ఒకప్పుడు బాలీవుడ్‌లో సింగింగ్‌ స్టార్‌గా ఎదిగిన రేణు మండల్.. ఇప్పుడు భోజనం కోసం ఇబ్బంది పడుతున్నారు.     

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link