Accident Viral Video: సోషల్ మీడియాలో నిత్యం వేలాది వీడియోలు ట్రెండ్ అవుతుంటాయి. వాటిలో ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసేవే ఎక్కువగా ఉంటాయి. ఇటీవలే సోషల్ మీడియాలో ఓ యాక్సిడెంట్ వీడియో వైరల్ గా మారింది. అందులో ఓ మహిళ త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడింది. స్కూటీతో రోడ్డు దాటుతుండగా ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన విజువల్స్ సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఇప్పుడా వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వీడియోలో ఏముందంటే?


ఈ యాక్సిడెంట్ కర్ణాటకలోని మణిపాల్ పోలీస్ స్టేషన్ సమీపంలో జరిగింది. సీసీ కెమెరాలో రికార్డు అయిన ఈ వీడియో ప్రకారం.. ఓ మహిళ స్కూటీపై రోడ్డు దాటేందుకు ప్రయత్నించింది. అయితే అదే సమయంలో అటువైపుగా ఓ లారీ అతివేగంతో దూసుకొచ్చింది. అయితే ఆ లారీ రాకను గమనించకుండా.. ఆ మహిళ ముందుకు వెళ్లింది. దీంతో లారీ ఆమెను ఢీకొంది. 


ఈ ఘటనలో స్కూటీ తీవ్రంగా ధ్వంసమైంది. అయితే ఈ ప్రమాదంలో ఆ మహిళకు స్వల్ప గాయాలు తగిలాయి. ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 



ఆశ్చర్యం ఏంటంటే.. కింద పడిన మహిళ కొన్ని సెకన్లలో లేచి నిలబడి హెల్మెట్ సరిచేసుకుంది. అయితే అంతటి ప్రమాదంలోనూ హెల్మెట్ తో బయట పడిందంటే అందుకు ఆమె ధరించిన హెల్మెట్ కారణమని నెటిజన్లు అంటున్నారు. మహిళను ఢీకొన్న లారీ డ్రైవర్ ఆపకుండా వెళ్లిపోయాడు. అయితే ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని మణిపాల్ పోలీసులు అంటున్నారు.  


Also Read: Bride Gun Firing: పెళ్లిలో తుపాకి పట్టిన వధువు.. షాక్ లో వరుడు తరపు బంధువులు!


Also Read: Lion Vs Buffalo Funny Video: గేదెలకు భయపడి చెట్టు ఎక్కిన మృగరాజు- వీడియో వైరల్!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook