Weird News: ప్రతీ కుక్కకు ఒక రోజు వస్తుంది అంటారు. మిగితా కుక్కల గురించి తెలియదు కానీ.. ఈ కుక్కకు మంత్రం లక్కు కిక్కు ఇస్తూ వరించింది అని చెప్పవచ్చు. కుటుంబ కలహాల మధ్య ఒక కుక్క కోటీశ్వరురాలైంది. ఈ ఘటన మధ్య ప్రదేశ్‌లో జరిగింది. కొడుకుపై కోపంతో పెంపుడు కుక్కకు ఆస్తి రాసిచ్చాడు ఒక పెద్దాయన. వివారాల్లోకి వెళ్తే...
Also Read | 7 Wonders: ప్రపంచంలో 7 అద్భుతాలు ఇవే


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

న్యూస్ 18 రిపోర్ట్ ప్రకారం. మధ్యప్రదేశ్‌కు (Madhya Pradesh) చెందిన ఓం నయన్ శర్మ అనే 50 ఏళ్ల రైతు జాకీ అనే తన పెంపుడుకు కుక్కకు.. తన పూర్వికులు అందించిన ఆస్తిని దారాదత్తం చేశాడు. ఈ మేరకు తన వీలునామాలో రాసినట్టు తెలిస్తోంది. కొడుకు ప్రవర్తనతో విసుగెత్తి ఇలా చేసినట్టు గ్రామాస్తులు చెబుతున్నారు.
Also Read | Coronavirus Vaccine కోసం Co-WIN యాప్ ప్రవేశపెట్టిన ప్రభుత్వం


ఈ విషయం గురించి పెద్దాయన భార్య, 47 సంవ్సరాల చంపాను వివరాలు కోరగా.. కొడుకు కన్నా.. కుక్కలోనే విశ్వాసం కనిపించింది అని అందుకే అలా చేశాం అన్నారు. అయితే ఆ పెద్దాయన ముందు తన యావద్ ఆస్తిలో కొంత మాత్రమే కుక్కకు రాశాడు.. మిగితాది తన భార్య పేరిట రాశాడు. అంతే గానీ కొడుకు పేరిట చిల్లి గవ్వ కూడా రాయలేదట. అసమర్ధుడికి ఆరటి (Banana) పండు ఇవ్వడం కూడా అనవసరం అనుకున్నాడేమో...ఏమో మరి!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook