Viral Video: సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో వైరల్ వీడియోలు దర్శనమిస్తుంటాయి. అందులో నవ్వు తెప్పించే ఫన్నీ వీడియోలు, ఒళ్లు గగుర్పొడిచే హార్రర్ వీడియోలు, కాలక్షేపానికి ఎంటర్టైన్‌మెంట్ వీడియోలు... ఇలా రకరకాలుగా ఉంటాయి. కొన్నిసార్లు హృదయాన్ని కదిలించే హార్ట్ టచింగ్ వీడియోలు కూడా తారసపడుతుంటాయి. తాజాగా ఇలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో నెటిజన్ల హృదయాలను హత్తుకుంటోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆ వీడియోను గమనిస్తే... ఓ మహిళ పార్క్‌లో కూర్చొని పల్లీల లాంటి గింజలేవో తింటోంది. ఇంతలో ఆమె వద్దకు చెంగు చెంగున ఓ చిట్టి ఉడుత పరిగెత్తుకొచ్చింది. అది ఆమె వైపే నోరు తెరిచి చూస్తుండటంతో తన చేతిలో ఉన్న గింజల్లో కొన్ని తీసి దాని నోట్లో పెట్టింది. ఇది చూసి మరికొన్ని ఉడతలు కూడా ఆమె చుట్టూ చేరాయి. అంతేనా... ఉడతలకు తోడు పక్షులు కడా జతయ్యాయి. కొన్ని బుల్లి పిట్టలు ఎగురుతూ వచ్చి ఆమె తలపై వాలిపోయాయి. 


సాధారణంగా మనుషులు కనిపిస్తే ఉడతలు దూరంగా పారిపోతాయి. పక్షులు ఎగిరిపోతాయి. కానీ ఇక్కడ పార్క్‌లో కూర్చొన్న మహిళను చూశాక.. ఆమె నుంచి తమకెలాంటి హానీ లేదని ఉడతలు, పక్షులు భావించినట్లున్నాయి. అందుకు తగినట్లే ఆమె కూడా వాటికి ప్రేమగా కొన్ని గింజలు పెట్టింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. డా.రిస్సీ అనే ట్విట్టర్ ఖాతా ద్వారా అప్‌లోడ్ అయిన ఈ వీడియోకు ఇప్పటికే 1.44 లక్షల వ్యూస్ వచ్చాయి.


Also Read: Telangana Formation Day: నేడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం.. స్వరాష్ట్ర కల సాకారమై ఎనిమిది వసంతాలు పూర్తి... 


Also Read: Horoscope Today June 2nd 2022: నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి జీవిత భాగస్వామి లేదా లవ్‌మేట్‌తో విభేదాలు...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook