Guru Grah Vakri 2022: ప్రతి గ్రహం నిర్దిష్ట సమయం తర్వాత వేరొక రాశిలో సంచరించడం లేదా తిరోగమించడం చేస్తోంది. ఆస్ట్రాలజీలో దేవగురు బృహస్పతిని శుభగ్రహంగా పరిగణిస్తారు. జూలై 29న గురుడు మీనంలో తిరోగమనం చెందాడు. నవంబరు 24 వరకు అదే స్థితిలో ఉండి.. తర్వాత సంచారంలోకి వస్తాడు. బృహస్పతి యెుక్క తిరోగమనం (Guru Grah Vakri 2022) అన్ని రాశులవారిని ప్రభావితం చేస్తోంది. అయితే గురు వక్రీ సమయంలో మూడు రాశులవారు అపారమైన ప్రయోజనాలను పొందనున్నారు. వీరి వృత్తి, వ్యాపారాల్లో విజయం సాధిస్తారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బృహస్పతి తిరోగమనం ఈ రాశులకు శుభప్రదం
వృషభం (Taurus): వృషభరాశి యెుక్క 11వ ఇంట్లో బృహస్పతి తిరోగమనంలో ఉన్నాడు. దీంతో వీరి ఆదాయం పెరుగుతుంది. వ్యాపారంలో మంచి లాభాలు సాధిస్తారు. బిజినెస్ లో పెద్ద డీల్ ఓకే కావచ్చు. ఈ టైంలో మీరు వాహనాన్ని  కొనుగోలు చేసే అవకాశం ఉంది. పెట్టుబడి పెట్టడానికి ఇదే మంచి సమయం. ఈ ఎనిమిదో ఇంటికి బృహస్పతి అధిపతి కావడం వల్ల ఈ రాశివారికి ధనలాభం ఉంటుంది.
మిధునరాశి (Gemini): మీనరాశిలో బృహస్పతి తిరోగమనం చేసిన వెంటనే వీరికి మంచి రోజులు మెుదలయ్యాయి. ఈ రాశి యెుక్క పదో ఇంట్లో గురుడు తిరోగమనం చేశాడు. జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగులకు పదోన్నతి, జీతాలు పెరిగే అవకాశం ఉంది. వ్యాపారంలో భారీ లాభాలను గడిస్తారు. కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. 
కర్కాటకం (Cancer): మీనంలో బృహస్పతి తిరోగమనం మీ అదృష్టాన్ని ప్రకాశింపజేస్తుంది. ఈరాశి యెుక్క తొమ్మిదవ ఇంట్లో గురుడు తిరోగమనంలో ఉంటాడు. ఇది అదృష్టం మరియు విదేశీ ప్రయాణాలకు సంబంధించిన ప్రదేశంగా పరిగణించబడుతుంది. దీంతో మీరు పెండింగ్ లో ఉన్న అన్ని పనులను పూర్తి  చేస్తారు. వ్యాపారానికి సంబంధించిన ప్రయాణాలు కలిసి వస్తాయి. లక్ తో అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. 


Also Read: Guru Margi 2022: 'పంచ మహాపురుష రాజయోగం' చేయబోతున్న గురుడు.. ఈ 3 రాశుల వారికి డబ్బే డబ్బు.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook