Mahalaya Amavasya 2022 Significance: హిందూ మతంలో పితృ పక్షానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ సమయంలో పూర్వీకులకు శ్రద్ధ, పిండ దానం, తర్పణం మొదలైనవి చేస్తారు. పితృ పక్షం మహాలయ అమావాస్య రోజుతో ముగుస్తుంది. దీనిని సర్వ పితృ అమావాస్య అని కూడా అంటారు. ఈ సంవత్సరం మహాలయ అమావాస్య (Mahalaya Amavasya 2022) సెప్టెంబరు 25,ఆదివారం నాడు వస్తుంది. పితృ పక్షం టైంలో పూర్వీకులు భూమ్మీదకు వచ్చి ఆహరం, నీటిని వివిధ రూపాల్లో తీసుకుంటారని నమ్ముతారు. కావున ఈ 15 రోజులు ఆవులు, కుక్కలు, కాకుల, చీమలు, నిరుపేదలు మరియు బ్రహ్మాణులకు ఆహారం పెట్టాలి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ ఏడాది అశ్వినీ మాస అమావాస్య తిథి అంటే మహాలయ అమావాస్య తిథి 25 సెప్టెంబర్ 2022 ఉదయం 03:12 గంటలకు ప్రారంభమై 26 సెప్టెంబర్ 2022 తెల్లవారుజామున 03:23 గంటలకు ముగుస్తుంది. ఈ రోజు పితృ పక్షం చివరి రోజు కావడంతో పూర్వీకుల ఆత్మకు శాంతి కలగాలని శ్రాద్ధం, తర్పణం మెుదలైనవి పూర్తి భక్తి శ్రద్ధలతో చేయాలి.  


మహాలయ అమావాస్య ప్రాముఖ్యత
మహాలయ లేదా సర్వపితృ అమావాస్య నాడు చనిపోయిన పూర్వీకులు తమవారి వద్దకు తిరిగి వస్తారని నమ్ముతారు. పూర్వీకులను ప్రసన్నం చేసుకోవడానికి మహాలయ అమావాస్య రోజున శ్రాద్ధం చేయండి. పూర్వీకుల ఇష్టానుసారం వంటలు చేసి వారిని స్మరించుకుంటూ ఆవులు, కుక్కలు, కాకులకు పెట్టండి. ఇది కాకుండా బ్రాహ్మణులకు మరియు పేదలకు ఆహారం ఇవ్వండి. ఇలా చేయడం వల్ల పూర్వీకులు సంతోషించి ఆశీర్వాదాలు ఇస్తారు. అంతేకాకుండా బ్రహ్మణులకు దక్షిణ ఇవ్వడం, పేదలకు దానం చేయడం మరచిపోకండి.  ఇలా చేస్తే పూర్వీకుల అనుగ్రహంతో మీ జీవితంలో సుఖ సంతోషాలు, శాంతి, ఐశ్వర్యం పెరుగుతాయి. 


Also Read: Indira Ekadashi 2022: ఇందిర ఏకాదశి వ్రతం ఎప్పుడు? ఈ వ్రత విశిష్టత ఏంటి?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి