Mars Transit In Leo 2023: కుజుడు జులై ఒకటో తేదీ తన రాశిని వదిలి వేరే రాశిలోకి సంచారం చేయబోతున్నాడు దీని కారణంగా అన్ని రాశుల వారిపై తీవ్ర ప్రభావం పడుతుందని జ్యోతిష్య శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. కుజుడు సింహరాశిలోకి సంచారం చేసే సమయం కొన్ని రాశుల వారికి తీవ్ర నష్టాలను తెచ్చిపెట్టే విధంగా ఉందని వారంటున్నారు. అంగారకున్ని జ్యోతిష్య శాస్త్రంలో శక్తి ధైర్యానికి సూచికగా భావిస్తారు. అంతేకాకుండా కుజుడ్ని మేష వృశ్చిక రాశి రాశికి చెందిన గ్రహంగా కూడా జ్యోతిష్య శాస్త్రంలో చదువుకుంటారు. కుజుడు సింహరాశిలో సంచారం చేయడం వల్ల ఏ రాశుల వారిపై తీవ్ర ప్రభావం పడుతుందో? ఏయే రాశుల వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ రాశుల వారిపై కుజుడి ప్రభావం:


మేషరాశి:
మేష రాశి వారికి కుజుడి సంచారం కారణంగా మనసు ప్రశాంతంగా ఉంటుంది. అంతేకాకుండా ఎలాంటి పనులకైనా కుటుంబ సభ్యులు మద్దతు తెలుపుతారు. అంతేకాకుండా దాంపత్య జీవితం మరింత సుఖంగా మారుతుంది. ఇక ఈ క్రమంలో ఆదాయ వనరులు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. కానీ వీరు కొన్ని విషయాల పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది.


వృషభ రాశి:
రాశి వారికి కూడా ప్రశాంతత లభిస్తుంది. వీరిపై వీరికి ఆత్మవిశ్వాసం పెరగడమే కాకుండా ఓపిక కూడా పెరిగే ఛాన్స్ ఉందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. విద్యార్థులైతే ఎలాంటి పోటీ పరీక్షలు రాసిన సులభంగా విజయాలు సాధిస్తారు. ఉద్యోగాలు చేసే వారికి ఆఫీసుల్లో గౌరవం లభించడమే కాకుండా ప్రమోషన్స్ లభించే అవకాశాలు కూడా ఉన్నాయి.


Also Read: Dalit Bandhu Phase 2: దళిత బంధు రెండో విడతకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్


కర్కాటక రాశి: 
కర్కాటక రాశి వారు కుజుడి సంచారం కారణంగా తీవ్ర దుష్ప్రభావాల బారిన పడతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. వీరికి మానసిక ప్రశాంతత లోపించి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ సంచారం క్రమంలో తప్పకుండా తల్లిదండ్రుల ఆరోగ్యంతో పాటు మీ ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా మీరు ఈ సంచారం కారణంగా దేవాలయం దర్శించే ఛాన్స్ కూడా ఉంది.


సింహరాశి:
సింహ రాశి వారు కూడా కర్కాటక రాశి వారి లాగా కొన్ని దుష్ప్రభావాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ సంచారం కారణంగా అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఖర్చులు పెరిగి ఆదాయం తగ్గే ఛాన్స్ కూడా ఉంది. ఇక వ్యాపారాలు చేసేవారు ఈ క్రమంలో పెట్టుబడి పెట్టడం వల్ల నష్టాలు రావచ్చని జ్యోతిష్య శాస్త్రాన్ని పనులు చెబుతున్నారు.


Also Read: Dalit Bandhu Phase 2: దళిత బంధు రెండో విడతకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి