Pitru Paksha 2022 Starting Date:  పితృ పక్షంలో ప్రజలు చనిపోయిన పూర్వీకులను స్మరించుకుంటారు. దాంతోపాటు వారి ఆత్మలకు శాంతి కలగాలని పిండ ప్రదానం చేస్తారు. అంతేకాకుండా ఈ పితృపక్ష (Pitru Paksha 2022) సమయంలో దానం, శ్రాద్ధం, తర్పణం వంటి కార్యక్రమాలు కూడా చేస్తారు. దీంతో పూర్వీకులు సంతోషించి వారిపై వరాల జల్లు కురిపిస్తారని నమ్మకం. ఈ సమయంలో పెళ్లి, క్షవరం, గృహ ప్రవేశం, కొత్త వస్తువులు కొనడం, శుభకార్యాలు వంటివి జరగవు. పితృ పక్షం సెప్టెంబరు 10న ప్రారంభమై...సెప్టెంబరు 25 వరకు ఉంటుంది. ఇది 15 రోజులు ఉంటుంది. జాతకంలో పితృ దోషం ఉంటే దాని నివారణకు  పితృ పక్షం సమయంలో ఈ చర్యలు చేయండి. పితృ దోషం నుండి విముక్తి పొందుతారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ పరిహారాలు చేయండి
>> సర్వ పితృ అమావాస్య రోజున నల్ల నువ్వులు, తెల్లటి చందనం, తెల్లటి పువ్వులు నీళ్లలో వేసి రావి చెట్టుకు పోయండి. దీని తరువాత, చెట్టు దగ్గర స్వచ్ఛమైన దేశీ నెయ్యి దీపాన్ని వెలిగిస్తూ, 'ఓం సర్వ పితృ దేవాయ నమః' అనే మంత్రాన్ని జపించండి. దీంతో మీకు పితృ దోషం నుండి విముక్తి లభిస్తుంది.
>> పితృ దోషం ఉన్నవారు ఇంటి దక్షిణ గోడపై పూర్వీకుల ఫోటోను ఉంచి పూల మాల వేయండి. దీంతో పూర్వీకుల ఆశీస్సులు లభించి పితృ దోషం నుంచి విముక్తి లభిస్తుంది.
>> పూర్వీకులు మరణించిన రోజున, నిరుపేదలు మరియు సద్గురువులు బ్రాహ్మణులకు దక్షిణ తినిపించి ఆహారం ఇవ్వడం ద్వారా మీకు మేలు జరుగుతుంది.


Also Read: Lord Ganesh: వినాయకుడి పుట్టుక వెనుకున్న ఆసక్తికర కథ ఇదే..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook