2019 క్రికెట్ ప్రపంచకప్‌లో భారత వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోని ఉంటాడా లేదా అన్న అనుమానం తొలిగిపోయింది. అతను ఆ ప్రతిష్టాత్మకమైన టోర్ని వరకు కొనసాగడం ఖాయమని అధికారికంగా తెలియజేయడమైంది.  భారత క్రికెట్‌ సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌ ఎమ్మెస్కే ప్రసాద్ ఈ విషయంపై క్లారిటీని అందించారు. ప్రస్తుతానికి భారత జట్టుకు ధోనీనే అత్యుత్తమ వికెట్‌ కీపర్‌ అని మేం భావిస్తున్నాం. 


ప్రపంచ క్రికెట్‌‌లోనే ధోని ఒక గొప్ప వికెట్ కీపర్. అందుకే అతనే వరల్డ్ కప్ వరకూ కొనసాగుతాడు అని ఆయన తెలిపారు. ధోనికి ప్రత్యామ్నాయంగా భావిస్తున్న రిషబ్‌ పంత్‌, సంజు శాంసన్‌ల వంటి యువ క్రీడాకారుల గురించి ప్రసాద్ వద్ద ప్రస్తావించగా.. వారిని మరింత తీర్చదిద్దాల్సి ఉందని.. భారత్ ఏ జట్టు తరఫున వారు ఆడతారని.. వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.