ఐపీఎల్ లో రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టు వరుస ఓటములు చవిచూస్తూ పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ జట్టుకు నాయకత్వం వహిస్తున్న కోహ్లీపై విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ కెప్టెన్సీని ప్రశ్నిస్తూ గౌతం గంభీర్ విమర్శలు సంధించారు.


ఆర్సీబీకి లాంటి బలమైన జట్టుకు కెప్టెన్‌గా ఉండటం నిజంగా కోహ్లీ అదృష్టమని మంటూనే... ఏడు సంవత్సరాలు పాటు ఒకే జట్టుకు కెప్టెన్‌గా ఉండి ఒక్కసారి కూడా కప్పు తేలేదని ఆరోపించారు. ప్రపంచంలోనే గొప్పబ్యామ్స్ అయి ఉండవచ్చు ... కానీ కెప్టెన్సీలో మాత్రం కోహ్లీ మరింత నేర్చుకోవాల్సి ఉందంటూ గంభీర్ క్లాస్ పీకాడు