Harbhajan on Kohli: నేటి నుంచి (జనవరి 11) సౌతాఫ్రికాతో జరగనున్న మూడో టెస్టులో టీమ్ఇండియా విరాట్ కోహ్లీ రాణిస్తాడని మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. రెండేళ్లుగా సెంచరీ కోసం కోహ్లీ.. ఇప్పుడు ఆ శతకం సాధిస్తాడని అన్నాడు. సౌతాఫ్రికాతో మూడో టెస్టు వింటేజ్ కోహ్లీని మీరు చూస్తారని హర్భజన్ సింగ్ ధీమా వ్యక్తం చేశాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అలాగే సౌతాఫ్రికాతో జరగనున్న రెండో టెస్టులో అర్ధశతకాలతో రాణించిన సీనియర్ బ్యాటర్లు అజింక్యా రహానె, ఛెతేశ్వర్‌ పుజారా కూడా ఈ మ్యాచ్‌లో బాగా ఆడతారని హర్భజన్‌ అన్నాడు. హాఫ్ సెంచరీలను సెంచరీలుగా మారుస్తారని అభిప్రాయపడ్డాడు. ఇప్పుడు వాళ్లిద్దరి ఎంపికపై నెలకొన్న సందేహాలు కాస్త తగ్గాయని చెప్పాడు. ఇలాంటి సీనియర్‌ ఆటగాళ్లు రాణించడం
టీమ్‌ఇండియాకు శుభపరిణామమన్నాడు. 


వెన్నునొప్పి కారణంగా కోహ్లీ రెండో టెస్టుకు దూరమవ్వగా.. ఇప్పుడు తిరిగి కోలుకొని మూడో టెస్టుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలోనే మళ్లీ జట్టు పగ్గాలు అందుకొని ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌ కైవసం చేసుకోవాలని చూస్తున్నాడు. 


Also Read: IPL 2022: ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ భేటీ నేడే, మెగా ఆక్షన్, ఐపీఎల్‌‌పై కీలక నిర్ణయం


Also Read: IPL 2022: కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్, పూర్తయిన సంప్రదింపులు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి