IND vs ENG 3rd Test Live Updates: రాజ్‌కోట్ టెస్టులో మూడో రోజు భార‌త బౌల‌ర్లు శుభారంభం అందించారు. ఆదిలోనే కీలకమైన మూడు వికెట్లు తీసి ఇంగ్లండ్ ను కష్టాల్లోకి నెట్టింది టీమిండియా. దీంతో లంచ్ సమయానికి టీమిండియా ఐదు వికెట్లు కోల్పోయి 290 పరుగులు చేసింది. స్టోక్స్ సేన ఇంకా 155 ప‌రుగులు వెన‌క‌బ‌డి ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఓవరనైట్ స్కోరు  207/2తో మూడో రోజు ఆట మెుదలుపెట్టిన ఇంగ్లీష్ జట్టు కాసేప‌టికే జో రూట్(18)ను బుమ్రా పెవిలియన్ కు చేర్చాడు. ఆ తర్వాత కుల్దీప్ యాద‌వ్ బెయిర్‌స్టో(0), బెన్ డ‌కెట్ (153)ల‌ను ఔట్ చేసి భార‌త్‌ను పోటీలోకి తీసుకొచ్చాడు. ప్ర‌స్తుతం కెప్టెన్ బెన్ స్టోక్స్(39 నాటౌట్), వికెట్ కీప‌ర్ బెన్ ఫోక్స్‌(6 నాటౌట్)లు క్రీజులో ఉన్నారు. టీమిండియా బౌలర్లలో కులదీప్ యాదవ్ రెండు వికెట్లు తీశాడు. 


తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 445 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌(132), ఆల్‌రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజా(112)లు సెంచరీలతో చెలరేగగా..స‌ర్ఫ‌రాజ్ ఖాన్(62), ధ్రువ్ జురెల్‌(46)లు విలువైన ఇన్నింగ్స్ ఆడారు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్ కు డకెట్ మెరుపు ఆరంభాన్నిచ్చాడు. క్రాలే వికెట్ కోల్పోయిన.. డకెట్ మెరుపులతో ఇంగ్లండ్ భారీ స్కోరు దిశగా దూసుకెళ్లింది. ఇతడికి ఒలీ పోప్ చక్కటి సహకారం అందించాడు. దీంతో రెండో రోజు ఆట‌ముగ‌సే సమయానికి ఇంగ్లండ్ 2 వికెట్ల న‌ష్టానికి 207 పరుగులు చేసింది. 


Also Read: HCA Cricket Coach: క్రికెట్‌కే మాయని మచ్చ.. మద్యం తాగుతూ బస్సులో మహిళా క్రికెటర్లతో అసభ్య ప్రవర్తన


Also Read: Ind vs Eng: ముగిసిన టీమిండియా తొలి ఇన్నింగ్స్.. ఎంత స్కోరు చేసిందంటే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter