బ్రిటిష్‌ ఓపెన్‌ జూనియర్‌ స్క్వాష్‌ టోర్నమెంట్‌లో భారత్ తరఫున బరిలోకి దిగిన యువ క్రీడాకారుడు నీల్‌ జోషి రన్నరప్‌ స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఆదివారం జరిగిన బాలుర అండర్‌–15 సింగిల్స్‌ ఫైనల్లో నీల్‌ జోషి 8–11, 16–14, 0–11, 12–14 స్కోరుతో టాప్‌ సీడ్‌ సామ్‌ టాడ్‌ (ఇంగ్లండ్‌) చేతిలో పరాజయం పొందాడు. అలాగే అండర్‌–17 బాలుర సెమీఫైనల్లో తుషార్‌ సహాని 11–9, 2–11, 3–11, 8–11 స్కోరుతో టాప్‌ సీడ్‌ ఒమర్‌ టోర్కీ (ఈజిప్ట్‌) చేతిలో ఓటమిపాలయ్యాడు.