India vs Afghanistan: టీ20 వరల్డ్​ కప్​లో భారత్ ఎట్టకేలకు విజయం సాధించింది. అబుదాబి వేదికగా అప్గానిస్థాన్​తో జరిగిన మ్యాచ్​లో ఘన విజయాన్ని ఖాతాలో వేసుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తొలి రెండు మ్యాచుల్లో దారుణంగా విఫలమైన జట్టు.. అఫ్గాన్​తో జరిగిన మ్యాచ్​లో అద్భుత ప్రదర్శన చేసింది. ఇప్పటికే రెండు మ్యాచులు గెలిచిన అప్గాన్​ను ఎదుర్కోవడం అంత సులువైన పని కాదని.. టీమ్ ఇండియా సమష్టి కృషితో విజయం సాధించింది.


మ్యాచ్ సాగిందిలా..


టాస్​ గెలిచిన అఫ్గాన్​ టీమ్​.. తొలిత ఫీల్డింగ్ ఎంచుకుంది. దీనితో వరుసగా మూడో మ్యాచ్​లోనూ భారత్ తొలుత బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. ఇండియా టీమ్​.. 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టంతో 210 పరుగులు చేసింది. ఫలితంగా అప్గాన్​ ముందు 211 భారీ లక్ష్యాన్ని ఉంచింది.


ఓపెనర్లుగా రోహిత్​ శర్మ, రాహుల్ బరిలో దిగారు. రోహిత్‌ 47 బంతుల్లో 74 పరుగులు చేశాడు. 8 ఫోర్లు, 3 సిక్సులు కొట్టి ఆకట్టుకున్నాడు. తొలి వికెట్​ కోల్పోయే సరికి భారత్ స్కోరు 140. పంత్ 27, హార్దిక్ పాండ్య 35 పరుగులు చేసి నాటౌట్​గా నిలిచారు. ఈ ఇద్దరు కూడా ఓపెనర్లు ఇచ్చిన జోరును కొనసాగించారు. మొత్తం మీద టీమ్ ఇండియా బ్యాటర్లు ఫామ్​లోకి వచ్చారు.


Also read: India’s batting coach: టీమ్​ ఇండియా బ్యాటింగ్ కోచ్ పదవికి విక్రమ్ రాథోడ్​ మరోసారి దరఖాస్తు


Also read: T20 World Cup 2021: విరాట్ కోహ్లీ, ఇండియా టీమ్ మేనేజ్మెంట్‌పై Sunil Gawaskar ఆగ్రహం


ఛేజింగ్​లో అఫ్గాన్ తడబాటు..


ఛేదనలో అఫ్గానిస్థాన్‌ టీమ్ తడబడింది. ఇండియా బౌలర్లను దాటికి  ఏమాత్రం ప్రతిఘటించలేకపోయింది. వెంటవెంటనే వికెట్లు కోల్పోవడం వల్ల.. విజయావకాశాలు చేజారాయి. మొత్తం 20 ఓవర్లు ఆడినా.. భారత్ విజయం ముందే  ఖరారేంది.


ఓపెనర్‌ షెజాద్‌ను మూడోఓవర్లో షమి డకౌట్ చేశాడు. మరో ఓపెనర్​ జజాయ్​ను 13 పరుగులకే బుమ్రా ఔట్ చేశాడు. ఆ తర్వాత కాస్త దూకుడుగా కనిపించిన గుర్బాజ్‌ను జడేజా ఔట్‌ చేశాడు. దీనితో అఫ్గాన్​ టీమ్ ఓటమి అంచులకు చేరువైంది.


రెండు  మ్యాచులకు దూరంగా ఉంటూ వచ్చిన రవిచంద్రన్ అశ్విన్.. అప్గాన్​తో ఆడేందుకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. వరుస ఓవర్లలో నైబ్‌ (18 పరుగులు), నజిబుల్లా జద్రాన్‌ (11 పరుగులు)ను ఔట్‌ చేయడంతో అఫ్గాన్‌ 12వ ఓవర్లో 5 వికెట్లు కోల్కోయి 69 పరుగులు వద్ద నిలిచింది.


అయితే భారత్​కు విజయం దాదాపు ఖరారైన ఈ మ్యాచ్​లో.. అఫ్గాన్​ టీమ్​ స్కోరు తేడాను తగ్గించేందుకు చివరి వరకూ ప్రయత్నించింది. చివరి బంతిలో అఫ్గాన్ బౌలర్ కరీం జనత్​ సిక్సు కొట్టాడు. దీనితో 144 పరుగులు సాధించింది అఫ్గాన్​ టీమ్. ఫలితంగా 66 పరుగుల తేడాతో భారత్​కు విజయం దక్కింది.


Also read: Virat Kohli: పాకిస్తాన్, న్యూజిలాండ్ మ్యాచ్‌లలో ఓడిపోవడానికి విరాట్ చెప్పిన కారణాలివీ


Also read: Team India Failure Record: పరాజయంలో టీమ్ ఇండియా 22 ఏళ్ల రికార్డు


టీమ్ ఇండియా రికార్డులు..


ఈ టీ20 ప్రపంచకప్‌లో ఇప్పటివరకూ ఓ ఇన్నింగ్స్‌లో జట్టు నమోదు చేసిన అత్యధిక స్కోరి ఇదే. ఇంతకు ముందు ఈ రికార్డు అఫ్గానిస్థాన్​పై ఉంది. ఈ జట్టు స్కాట్లాండ్‌పై 4 వికెట్ల నష్టంతో 190 పరుగులు చేసింది.


ఐసీసీ టోర్నీల చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రోహిత్‌ శర్మ రికార్డు సృష్టించాడు. రోహిత్​ ఖాతాలో 3682   పరుగులు ఉన్నాయి. ఇంతకు ముందు ఈ రికార్డ్ ఇంగ్లాండ్ ఆటగాడు జో రూట్‌ (3662)పై ఉంది.


Also read: T20 World Cup 2021: అది జరిగితే..టీమ్ ఇండియా సెమీస్ ఆశలు సజీవంగా ఉంటాయి


Also read: Shane Warne x Steve Smith: షేన్​వార్న్​పై ఆస్ట్రేలియా అభిమాలు ఆగ్రహం- స్టీవ్​ స్మిత్​ను విమర్శించాడని..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook