భారత్‌-న్యూజిలాండ్‌ జట్ల మధ్య మంగళవారం నాడు మూడో టీ20 (ఫైనల్‌) మ్యాచ్‌ జరగనుంది. తిరువనంతపురంలోని గ్రీన్‌ ఫీల్డ్‌ ఇంటర్నేషనల్‌ స్టేడియంలో రాత్రి 7 గంటలకు మ్యాచ్‌ మొదలవనుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో చెరొక మ్యాచ్‌ నెగ్గి 1-1తో ఇరు జట్లు సమంగా ఉన్నాయి. కాగా ఫైనల్‌ మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది. 


ఇదిలా ఉండగా, టీమిండియా కెప్టెన్ తిరువనంతపురంలో డ్రగ్స్ వ్యతిరేక కార్యక్రమంలో పాల్గొని, డ్రగ్స్ తదితర మత్తుపదార్థాలకు యువత దూరంగా ఉండాలని  పిలుపునిచ్చారు. కేరళ రాష్ట్ర పోలీసులు ప్రారంభించిన 'ఎస్ టు క్రికెట్, నో టు డ్రగ్స్' అనే కార్యక్రమానికి మద్దతు పలికాడు. ఈ కార్యక్రమంలో  కేరళ సీఎం పినరయి విజయన్, టీమిండియా క్రికెటర్లు పాల్గొన్నారు.