క్రికెట్ ప్రియులకు బ్యాడ్ న్యూస్. ఐపిఎల్ 2020 టోర్నమెంట్ వాయిదా వేసి బీసీసీఐ తమను నిరాశకు గురిచేసిందని క్రికెట్ ప్రియులు భావిస్తుండగానే తాజాగా బీసీసీఐ మరో నిర్ణయం తీసుకుంది. సౌతాఫ్రికాతో ప్రస్తుతం ఆడుతున్న వన్డే సిరీస్‌ని సైతం రద్దు చేసుకుంటున్నట్టుగా బీసీసీఐ ప్రకటించింది. ఇప్పటికే ధర్మశాల వేదికగా ఒక వన్డే వాషౌట్ కాగా.. లక్నో వేదికగా జరగనున్న రెండో వన్డే కోసం ఇరు జట్లు శుక్రవారమే లక్నోకు చేరుకున్నాయి. అయితే, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మిగతా 2 వన్డేలు అయినా రద్దు చేసుకోవడమే మేలని భావిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నామని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించినట్టుగా పీటీఐ పేర్కొంది.