మరో రెండు వారాల్లో ఐపీఎల్ 2018 సీజన్ ప్రారంభం కానుంది. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులకు వినోదం, సరదాలను అందించేందుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ప్రాంఛైజీలు సిద్దమవుతున్నాయి. ఇందులో భాగంగా జట్టు వాణిజ్య ప్రకటనల షూటింగుల్లో ఆటగాళ్లంతా బిజీబిజీగా ఉన్నారు. ఎంఎస్ ధోనీ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు కూడా వాణిజ్య ప్రకటనల్లో నటిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా ఓ ప్రకటన కోసం చేస్తున్న షూటింగులో చిన్న  క్లిప్‌ను చెన్నై జట్టు ట్విటర్‌లో పోస్ట్ చేసింది. ఇందులో ధోనీ బాల్‌ని క్యాచ్ పట్టిన అనంతరం డ్యాన్స్ చేస్తూ.. తోటి ఆటగాళ్లతో ఆనందంలో మునిగిపోతాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. ధోనీ సీరియస్‌గా స్క్రిప్ట్ చదువుతుండగా తీసిన ఫొటో కూడా వైరల్ అయింది. ధోనీ జట్టులో స్టార్ క్రికెటర్లు సురేశ్ రైనా, మురళీ విజయ్, డ్వేన్ బ్రావో, షేన్ వాట్సన్, హర్భజన్‌సింగ్‌లు ఉన్నారు.