దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020)లో తొలి సమరానికి ఢిల్లీ క్యాపిటల్స్ (DC) సిద్ధమైంది. దుబాయ్ వచ్చి క్వారంటైన్ పూర్తి చేసుకున్న ఢిల్లీ టీమ్ విజయవంతంగా తమ ప్రాక్టీస్ సెషన్లలో పాల్గొంది. గతేడాది ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించిన జట్టు ఈ ఏడాది సంచలనాలు నమోదు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు కనపిస్తోంది. నేటి రాత్రి ఏడున్నర గంటలకు తమ తొలి మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (Kings Xi Punjab)తో తలపడనుంది. Chris Gayle: అరుదైన రికార్డుకు చేరువలో క్రిస్ గేల్



దుబాయ్ హోటల్‌లో బస చేస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి బయలుదేరింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, శిఖర్ ధావన్ లాంటి ఆటగాళ్లు బ్యాటింగ్‌లో ఉండగా.. బౌలింగ్‌లోనూ ప్రతిభకు కొదవేమీ లేదు. యువ ఆటగాళ్ల ఢిల్లీకి పేరుంది. మరోవైపు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఈ సీజన్‌లో మెరుగ్గా రాణించాలని పట్టుదలతో ఉంది. కెప్టెన్ కేఎల్ రాహుల్, క్రిస్ గేల్ లాంటి ఆటగాళ్లు పంజాబ్ బలం. బౌలింగ్‌లో మహ్మద్ షమీ, ముజీబ్, కోట్రెల్ ఉన్నారు. MSK Prasad Trolls: అంబటి రాయుడు అదరహో.. ఎమ్మెస్కే ప్రసాద్‌పై 3D రేంజ్‌లో ట్రోలింగ్