న్యూఢిల్లీ:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అభిమానులకు శుభవార్త. ప్రారంభ మ్యాచ్ నుంచే ఐపీఎల్ మహా సంగ్రామం మొదలుకానుంది. ప్రారంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌ను చెన్నై సూపర్ కింగ్ ఢీకొట్టనుంది. ఇందుకు ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా మారనుంది. ఐపీఎల్ చరిత్రలో ముఖాముఖీ ఫైనల్ పోరులో ఎక్కువ పర్యాయాలు తలపడ్డ జట్ల మధ్య మ్యాచ్‌తో ఈ సీజన్ ప్రారంభం కావడం విశేషం. మార్చి 29 నుంచి ఐపీఎల్ 2020 ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: ఐపీఎల్ స్పెషల్ క్రికెటర్‌కు బీసీసీఐ షాక్‌!


లీగ్‌లో ఆఖ‌రి మ్యాచ్‌ మే 17న ముంబై ఇండియన్స్, రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జట్ల మ‌ధ్య బెంగళూరు చిన్నస్వామి స్డేడియం జ‌రగనుంది. ఈ సీజన్‌లో రెండు మ్యాచ్‌ల నిర్వహణను కేవలం ఆదివారానికే పరిమితం చేశారు. దీంతో సీజన్ కొన్ని రోజుల అదనంగా జరగనుంది. ఇప్పటివరకు జరిగిన సీజన్లలో శని, ఆదివారాల్లో మాత్రమే రెండు మ్యాచ్‌లు నిర్వహించారు. 



రెండు మ్యాచ్‌లు ఉండే సాయంత్రం మ్యాచ్ 4 గంటలకు తొలి మ్యాచ్, రెండో మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభం అవుతాయని తెలిసిందే. జైపూర్ తర్వాత గువాహటిని తమ రెండో వేదికగా  రాజస్థాన్ రాయల్స్ ఎంచుకుంది. కాగా, ఐపీఎల్ 2019 ఫైనల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై రోహిత్ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ విజయం సాధించి ట్రోఫీ అందుకుంది.  


IPL 2020: ఆర్సీబీ మ్యాచ్‌ల షెడ్యూలు


జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..