మహిళల వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్ పోటీల్లో భారత బాక్సర్ మేరీ కోమ్ ఉక్రెయిన్ బాక్సర్ హన్నా ఒకొటాను ఓడించి గోల్డ్ మెడల్ గెల్చుకున్నారు. ఇప్పటికే ఐదుసార్లు వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌గా నిలిచిన మేరీకోమ్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో ఆరోసారి గోల్డ్ మెడల్ గెల్చుకుని ప్రపంచ విజేతగా నిలవడం విశేషం. 48 కేజీల లైట్ ఫ్లై వెయిట్ బాక్సింగ్ పోటీల్లో ఆమె ఈ ఘనత సాధించారు.


ఆరోసారి ప్రపంచ విజేతగా నిలిచిన అనంతరం మీడియాతో మాట్లాడిన మేరీకోమ్.. తన విజయాన్ని భారతదేశానికి అంకితం చేస్తున్నానని గర్వంగా ప్రకటించారు.