PV Sindhu: ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో షటిల్ బ్యాడ్మింటన్ అకాడమీ ప్రారంభం కానుంది. ప్రముఖ షట్లర్, ఒలింపిక్ పతక విజేత పీవీ సింధూ ఈ అకాడమీను ప్రారంభించనున్నారు. ఏపీలో పీవీ సింధూ అకాడమీను ఎక్కడ ప్రారంభించనున్నారంటే..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఒలింపిక్స్ పతక విజేత పీవీ సింధూని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (Ap cm ys jagan)అభినందించారు. టోక్యో ఒలింపిక్స్‌(Tokyo olympics)లో కాంస్య పతకాన్ని గెల్చుకున్న పీవీ సింధూ తల్లిదండ్రులతో కలిసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిశారు. ముఖ్యమంత్రి జగన్ ఆశీర్వాదంతోనే పతకాన్ని సాధించినట్టు జగన్‌కు చెప్పారు. ఈ సందర్భంగా పీవీ సింధూను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఘనంగా సత్కరించారు. ప్రభుత్వం తరపున 30 లక్షల నగదు బహుమతి అందించారు. విశాఖలో త్వరలో అకాడమీ ప్రారంభించాలని వైఎస్ జగన్..పీవీ సింధూకు సూచించారు. 


ఏపీ ప్రభుత్వం క్రీడాకారులకు మంచి ప్రోత్సాహం అందిస్తోందని ఒలింపిక్ విజేత పీవీ సింధూ( PV Sindhu) కొనియాడారు. ఒలింపిక్స్‌కు వెళ్లేముందు కూడా ముఖ్యమంత్రి జగన్ ఆశీర్వాదం తీసుకున్నానన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల్లో క్రీడాకారులకు 2 శాతం రిజర్వేషన్ అమలు చేస్తుండటం మంచి విషయమన్నారు. విశాఖలో అకాడమీ( Academy in Visakhapatnam) ప్రారంభించేందుకు ప్రభుత్వం భూమి కేటాయించిందని..త్వరలోనే ప్రారంభిస్తానని పీవీ సింధూ స్పష్టం చేశారు. 


Also read: కరోనా మహమ్మారి నియంత్రణకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook