స్విట్జర్లాండ్‌లోని బసెల్‌లో జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ చాంపియన్‌షిప్ పోటీల్లో తైవాన్ స్టార్ షట్లర్ తై జు యింగ్‌ని ఓడించి పివి సింధు సెమీ-ఫైనల్స్‌కి చేరారు. శుక్రవారం క్వార్టర్ ఫైనల్స్‌లో మాజీ వరల్డ్ చాంపియన్ తై జు యింగ్‌తో హోరాహోరి సాగిన ఉత్కంఠ పోరులో 12-21, 23-21, 21-19 తేడాతో పివి సింధు విజయం సాధించింది. తొలి రౌండ్‌లో నెమ్మదించిన పివి సింధు 9 పాయింట్స్ తేడాతో వెనుకబడిపోయింది. రెండో రౌండ్‌లో మొదటి నుంచే దూకుడు ప్రదర్శించిన సింధు రెండు పాయింట్స్ ఆధిక్యంలోకి వచ్చింది. అనంతరం జరిగిన మూడో రౌండ్‌‌లో తైవాన్ షట్లర్ రెచ్చిపోయినప్పటికీ.. ఆట మధ్యలో సింధు ఆమెపై పైచేయి సాధించి మొత్తంగా ఆటలో నెగి సెమీ-ఫైనల్స్‌లోకి ప్రవేశించింది.


చైనాకు చెందిన చెన్ యు ఫి, డెన్మార్క్‌కి చెందిన మియా బ్లిచ్‌ఫెడ్‌ల మధ్య గెలిచిన విజేతతో శనివారం జరిగే సెమీ ఫైనల్స్‌లో పివి సింధు తలపడనుంది.