సౌతాఫ్రికాతో సుదీర్ఘమైన సిరీస్ ఆడేందుకు ఆ దేశం గడ్డపై కాలుపెట్టిన టీమిండియా కెప్టేన్ విరాట్ కోహ్లీ, ఓపెనర్ శిఖర్ ధావన్ కేప్ టౌన్‌లో నూతన సంవత్సరం వేడుకల్లో పాల్గొని ఎంజాయ్ చేశారు. అక్కడి వీధుల్లో ఏర్పాటు చేసిన బ్యాండ్ మేళం వారు వాయించిన ట్యూన్స్‌కి తగినట్టుగా సరదాగా స్టెప్పులేసి ఇండియన్ క్రికెటర్స్ జోష్ ఏంటో చూపించుకున్నారు. ఈ వీడియోలో శిఖర్ ధావన్ తనయుడు తన డ్యాడీ దగ్గరికెళ్తున్న దృశ్యాన్ని కూడా గమనించొచ్చు. సౌతాఫ్రికాతో జనవరి 5న ప్రారంభం కానున్న సిరీస్ ఫిబ్రవరి 24వరకు కొనసాగనుంది.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 < >

ఇన్‌స్టాగ్రామ్‌లో డిసెంబర్ 31న పోస్ట్ అయిన ఈ వీడియో చూస్తే ఎవరికైనా కూర్చున్న చోటు నుంచి లేచి ఓ స్టెప్పేయాలనిపించకమనదు. లేదంటే అప్రయత్నంగానైనా తమ శరీరం ట్యూన్‌‌కి అనుగుణంగా అటు ఇటు కదలకుండా వుండకపోదు చూడండి!!