బెంగళురు రాయల్ ఛాలెంజర్స్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఐపీఎల్ మేనేజ్‌మెంట్ భారీ జరిమానా విధించింది. స్లో ఓవరేట్ కారణంగా కోహ్లీపై 12 లక్షల జరిమానా విధించినట్లు ప్రకటించారు. బుధావరం రాత్రి చెన్నైతో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ తలపడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో స్లో ఓవర్ రేటు నమోదు కావడంతో కోహ్లీపై ఈ మేరకు జరిమానా విధించారు. స్లో ఓవర్ రేట్ అనేది ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌కు వ్యతిరేకమని .. అందుకే జరిమానా విధిస్తున్నామని ఐపీఎల్ మేనేజ్ మెంట్ వెల్లడించింది. 


ఇప్పటి వరకు 6 మ్యాచుల్లో తలపడిన బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు కేవలం రెండు విజయాలు మాత్రమే నమోదు చేసింది. వరుస అపజయాలు ఎదుర్కొంటున్న కోహ్లీకి.. ఫైన్ వ్యవహారం మరింత తలనొప్పిగా పరిగణిస్తోంది. అయితే దీనిపై కోహ్లీ నుంచి ఎలాంటి రియాక్షన్ లేదు.