Kohli Fans Fires On BCCI: ఈ ఏడాది చివర్లో సౌతాఫ్రికా పర్యటనకు టీమ్ఇండియా వెళాల్సి ఉంది. ఈ క్రమంలో భారత జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI News) ప్రకటించింది. ఈ పర్యటనలో రోహిత్ శర్మను వన్డే జట్టుకు కెప్టెన్ గా నియమించింది బీసీసీఐ. అయితే విరాట్ కోహ్లీని కెప్టెన్ గా తొలగించడంపై ట్విట్టర్ లో భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. కొందరు ఈ నిర్ణయాన్ని స్వాగతించగా.. మరికొందరు మాత్రం బీసీసీఐ, సౌరవ్ గంగూలీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

"టీ20లతో పాటు వన్డేల్లో టీమ్ఇండియా కెప్టెన్ గా రోహిత్ శర్మను నియమించాలని ఆల్​ ఇండియా సీనియర్ సెలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంది" అని బీసీసీఐ బుధవారం​ తమ ట్విట్టర్ ఖాతాలో ఈ విషయాన్ని వెల్లడించింది.


అయితే.. విరాట్​ కోహ్లీ తానే స్వయంగా తప్పుకుంటున్నట్లు కమిటీకి చెప్పాడా? లేదా బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుందా? అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.


ఫ్యాన్స్ ట్వీట్లు..


టీ20 ప్రపంచకప్​నకు ముందు సారథిగా తప్పుకుంటున్నట్లు విరాట్ కోహ్లీ ట్విట్టర్​ ద్వారా అభిమానులకు తెలిపాడు. 2023 ప్రపంచకప్​ దృష్ట్యా వన్డే, టెస్టు జట్లకు మాత్రం సారథిగానే కొనసాగుతానని పేర్కొన్నాడు. అయినప్పటికీ.. బీసీసీఐ తాజా నిర్ణయంతో ఫ్యాన్స్ మండిపడుతున్నారు. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ సహా సెక్రటరీ జై షా పై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. 






Also Read: India Squad for South Africa Series: టెస్ట్ జట్టును ప్రకటించిన బీసీసీఐ..జడేజాతో పాటు మరో ఇద్దరు ఔట్


Also Read: Rohit Sharma : టీమిండియా వన్డే కెప్టెన్‌గా హిట్‌ మ్యాన్ రోహిత్‌ శర్మ 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook