ఆగస్టు 26న దేశవ్యాప్తంగా రక్షా బంధన్ సంబరాలు ఘనంగా జరిగాయి. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు తమ సోదరితో రాఖీ కట్టించుకున్న ఫోటోలు, వీడియోలు ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై పోస్ట్ చేసి అందరికీ రాఖీ పండగ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ప్రస్తుతం ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న టీమిండియా కెప్టేన్ విరాట్ కోహ్లీ సైతం తన చిన్ననాటి ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకుని అప్పట్లో తన సోదరి భావనా కోహ్లీ ధింగ్రాతో జరుపుకున్న వేడుకను గుర్తుచేసుకున్నాడు. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


విరాట్ కోహ్లీ తన అక్క భావనా కోహ్లీ ధింగ్రాతో కలిసి కేక్ కట్ చేస్తోన్న ఆ ఫోటోకు లక్షల కొద్ది లైక్స్, కామెంట్ వచ్చిపడ్డాయి. ఈ ఫోటోను పోస్ట్ చేస్తూ.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సోదరీమణులందరికీ విరాట్ కోహ్లీ రాఖీ పండగ శుభాకాంక్షలు తెలిపాడు.