భారత్‌తో తలపడనున్న విండీస్ వన్డే జట్టు ఆటగాళ్ల జాబితాను విండీస్ క్రికెట్ బోర్డ్ ప్రకటించింది. విధ్వంసకర ఆటగాడిగా పేరున్న క్రిస్ గేల్‌కి ఈ జట్టులో చోటు లభించింది. వరల్డ్ కప్ టోర్నమెంట్ సమయంలో తాను అంతర్జాతీయ క్రికెట్‌కి గుడ్‌బై చెప్పదల్చుకున్నట్టు ప్రకటించిన గేల్.. ఆ తర్వాత తన మనసు మార్చుకోవడంతో అతడికి విండీస్ వన్డే జట్టులో స్థానం దక్కింది. సునీల్ ఆంబ్రిస్, డారెన్ బ్రావో, షనాన్ గాబ్రియెల్, ఆష్లీ నర్స్‌ వంటి ఆటగాళ్లను విండీస్ సెలెక్టర్లు పక్కనపెట్టారు. అలాగే గాయం కారణంగా ప్రపంచ కప్ టోర్నీ మధ్యలోనే వైదొలిగిన ఆండ్రూ రస్సెల్‌కు కూడా ఈ జట్టులో అవకాశం దక్కలేదు. 


విండీస్ జట్టు ఆటగాళ్ల జాబితా : జాసన్ హోల్డర్ (కెప్టెన్), జాన్ కాంప్‌బెల్, ఎవిన్ లూయిస్, షిమ్రాన్ హెట్‌మెయిర్, నికోలస్ పూరన్, రోస్టన్ చేజ్, ఫబియన్ అలెన్, కార్లోస్ బ్రాత్‌వైట్, కీమో పాల్, క్రిస్ గేల్, షెల్డన్ కాట్రెల్, ఒషానే థామస్, షాయ్ హోప్, కెమార్ రోచ్.