వరల్డ్ కప్ లీగ్ దశలో ఆసీస్ జట్టు తన ఖాతాలో మరో విజయాన్ని వేసుకొంది. ఓవల్ వేదికగా జరిగిన మ్యాచ్ లో శ్రీలంకపై 87 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 334 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆసీన్ తరఫున ఆరోన్ ఫించ్ సెంచరీతో (153) చెరలేగడంతో ఈ భారీస్కోర్ సాధ్యపడింది. కాగా స్మిత్ 73 పరుగులతో భారీ స్కోర్ నమోదుకు తన వంతు సాయం అందించాడు.


ఇదిలా ఉండగా 335 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లంక జట్టు తొలుత లక్ష్యాన్ని చేధించే దిశగా కనిపించినా చివర్లో వరుగా వికెట్లు పడిపోవడంతో లక్ష్యచేధనలో వెనకబడింది. భారీ లక్ష్యం కళ్లముందు కనిపిస్తుండంతో ఒత్తిగాకి లోనై చివరికి లంకేయులు 45.5 ఓవర్లలో 247 పరుగులకు ఆలౌట్ అయ్యారు. దీంతో ఆసీస్ ఈ టోర్నీలో మరో విజయాన్ని సొంతం చేసుకుంది.